విశాఖపట్నం

మూడు గంటలు ఆలస్యంగా గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 17: పెథాయ్ తుపాను ప్రభావం పలు రైళ్ళ రాకపోకలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యమైన రైళ్ళు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రముఖుల ఎక్స్‌ప్రెస్ అయిన గోదావరి సోమవారం రాత్రి 8.25గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళింది. దీంతో ఇందులో బయలుదేరి వెళ్ళే ప్రజాప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గంటల తరబడి ప్లాట్‌ఫారాలమీదే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఎపుడూ ఆలస్యంగా కానీ గోదావరి చాలాకాలం తరువాత మళ్ళీ పెథాయ్ తుపాను కారణంగా గంటలు కొలది నిలిచిపోవాల్సి వచ్చింది. స్టేషన్‌కు చేరుకునే పలు రైళ్ళు ఔటర్‌లోనే నిలిచిపోవడంతో, బయలుదేరాల్సిన వాటికి గ్రీన్‌సిగ్నల్ లభించక ఇవేమీ కదలని పరిస్థితులు నెలకొన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలాగే విశాఖపట్నం-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలకు పైగానే ఇక్కడ నుంచి ఆలస్యంగా బయదేరాల్సి వచ్చింది. వీటితోపాటు విశాఖపట్నం-రాజమండ్రి పాసింజర్ మూడు గంటలపాటు ఆలస్యమైంది. ఈ విధంగా పలు రైళ్ళు గంటల తరబడి ఆలస్యంగా బయలుదేరడంతో ప్రయాణికులు సోమవారం రోజంతా నరకం చూడాల్సి వచ్చింది. తుపాను ప్రభావంతో బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షంతో దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు విశాఖరైల్వేస్టేషన్‌కు చేరుకోవడం పెద్ద సమస్యగా మారింది. తీరా స్టేషన్‌కు చేరుకునేసరికి రైళ్ళ ఆలస్యంగా గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.
* ఆటోలు, సిటీ బస్సుల్లేక ఇబ్బందులు...
తుపాను ప్రభావంతో ఆటోలు ఎక్కడా కనిపించనేలేదు. ఒక్క ఆటో కూడా రోడ్డెక్కలేదు. బంద్ వాతావరణాన్ని తలపించే విధంగా స్టాండ్‌ల్లోను, రోడ్డుపైనే ఎక్కడా కూడా ఒక్క ఆటో అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు నరకం చూడాల్సి వచ్చింది. ఇక సిటీ సర్వీసులు సైతం డిపోలకే పరిమితమయ్యాయి. సోమవారం ఉదయం నుంచి పల్చగా నడుస్తోన్న సిటీ సర్వీసుల్లో కొన్ని సోమవారం ఉదయం నుంచి ఏకదాటిగా కురుస్తోన్న కుండపోత వర్షానికి రోడ్డెక్కిన కొన్ని సిటీలు ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విదంగా ఆటోలు రోజంతా ఎక్కడా కనిపించకపోగా, సిటీ సర్వీసులు అంతంత మాత్రంగానే ఉన్నందున ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చింది.