విశాఖపట్నం

మోదీ సభ అనంతరం అపోహలు తొలగుతాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 20: మార్చి 1న విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభతో రాష్ట్ర ప్రజలకు బీజేపీపై ఉన్న అపోహలు తొలగిపోతాయని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. విశాఖ రైల్వే స్టేషన్‌లో బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ సభలో రాష్ట్రానికి తాము చేసింది, చేయబోయేది వెల్లడిస్తారన్నారు. విశాఖ రైల్వేజోన్ విషయంలో ఇప్పటికీ తాము చెప్పన మాటకు కట్టుబడి ఉన్నామని, తాను ఎంపీగా ఉండగానే జోన్ వస్తుందని మరోసారి ఉద్ఘాటించారు. ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న అంశం అధిష్టానం పరిధిలోనిదని, అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు తాము కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు. సొంతంగా పోటీ చేయాలా, వేరే పార్టీతో కలిసి వెళ్లాలా అన్న నిర్ణయాలు ఎన్నికల ముందు అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్న అధిష్టానం ఏపీ విషయంలోనూ స్పందిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశాన్ని కూడా అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు.