విశాఖ

ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక/పరవాడ, జూన్ 14: పరవాడ వద్ద గల సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎన్టీపీసీ) రెండవ ఐదు వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రంలో మంగళవారం సాంకేతిక లోపం కారణంగా ఉత్పత్తి నిలిచి పోయింది. కార్మిక వర్గం అందించిన సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రెండవ ఐదు వందల మెగావాట్ల యూనిట్‌కు సంబంధించిన టర్బైన్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని, దీనికారణంగా అధికారులు యూనిట్-2లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపి చేసినట్లు కార్మిక వర్గాలు తెలిపాయి. టర్బైన్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరి చేసేందుకు ఇంజనీరింగ్ విభాగం అధికారులు కృషి చేస్తున్నారు. టర్బైన్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరి చేసి బుధవారం ఉదయానికి తిరిగి విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం సింహాద్రిలో 1,3,4 యూనిట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి.