విశాఖ

దోషాలు తొలగించే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 29: కుజస్తంభన, కాలసర్ప దోషాలున హరించే శక్తి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉందని షణ్ముఖ స్థాపనాచార్య జగద్గురు శంకరాచార్య విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. రుషికేష్ పర్యటనలో ఉన్న స్వరూపానంద సరస్వతి స్వామి అదైకృతిక సందర్భంగా శ్రీ వల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమక, చమక, మన్యసూక్తం, పురుషసూక్తం, వేద మంత్రోచ్ఛారణల నడుమ విశేష పంచాభిషేకాలు నిర్వహించారు. నగర శివారు చినముషిడివాలోని శ్రీ శారదాపీఠంలో స్వామి వారి ఆశీస్సులతో ఆస్థాన పండితుల ఆధ్వర్యంలో అదైకృతిక ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామి వారు తమ దివ్య ఆశీస్సులను భక్తులకు అందించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నిత్యం పూజించిన వారికి జాతకరీత్యా సంక్రమించే దోషాలు తొలగిపోతాయని భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా శారదాపీఠంలో శ్రీ వల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్యస్వామి వారి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. పీఠంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పీఠంలో నిర్వహించిన కార్యక్రమంలో పీఠ ఆస్థాన పండితులు శ్రీ కృష్ణశర్మ ఆధ్వర్యంలో జరిగాయి.