విజయనగరం

అభివృద్ధి పనులపై శే్వతపత్రం విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూలై 21: మున్సిపాలిటీలో ఈ రెండేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై శే్వతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశపువేణు డిమాండ్ చేశారు. గడపగడపకూ వైకాపా కార్యక్రమంలో భాగంగా గురువారం 19వ వార్డు స్టేడియంపేటలో పాదయాత్ర నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ రూపొందించిన ప్రజా బ్యాలెట్‌ను ఇంటింటికి పంపిణీ చేశారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు ఆశపువేణు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. పాదయాత్రలో అనేక సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ప్రజలు చెబుతున్నారని అన్నారు. ఇళ్లు మంజూరు కాలేదని, అద్దె ఇళ్లలో నివాసం ఉండలేని పరిస్థితి ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కార్పొరేషన్ హోదా నుండి మున్సిపాలిటీ స్థాయికి దించిన ఘనత తెలుగుదేశం పాలకులకే దక్కిందని విమర్శించారు. పట్టణంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని, నిధులున్నా అభివృద్ధి చేయలేకపోతున్నారని ఆరోపించారు. ఈ రెండేళ్ల పాలనలో మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధిని శే్వతపత్రం ద్వారా విడుదల చేయాలని ఆశపువేణు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మామిడి అప్పలనాయుడు, నాగబాబు, రమణ, సోమరాజు, అప్పలనాయుడు పాల్గొన్నారు.