జాతీయ వార్తలు
బెంగాల్ పోలింగ్లో హింస: ఒకరి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 April 2016
కోల్కత: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి గురువారం జరుగుతున్న మూడో విడత పోలింగ్లో హింస చోటుచేసుకుంది. బుర్ద్వాన్ జిల్లా కేటుగ్రామ్లో పోలింగ్ బూత్ వద్ద ప్రత్యర్థులు నాటు బాంబు విసరగా ఓ సిపిఎం కార్యకర్త మృతిచెందాడు. గాయపడ్డ ఇద్దరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మూడో విడతలో 62 నియోజవర్గాల్లో 16వేల పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నాటుబాంబు పేలడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.