మెదక్

బ్రాహ్మణుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 6 : బ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పెద్దపీటా వేస్తున్నాడని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమాఖ్య రాష్ట్ర ప్రధానకార్యదర్శి బోరపట్ల హన్మంతాచారి, మెదక్ జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు, కెసిఆర్ గురువు మృత్యుంజయ శర్మలు వెల్లడించారు. బ్రాహ్మణ సంక్షేమకోసం వంద కోట్లు కేటాయించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో ఏ ముఖ్యమంత్రి బ్రాహ్మణుల అభివృద్ధి కోసం ఇన్ని కోట్ల నిధులు కేటాయించలేదన్నారు. పేద బ్రాహ్మణుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తానని సిఎం కెసిఆర్ చెప్పటం అభినందనీయమన్నారు. పేద బ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్‌షిప్, హస్టల్ వసతి, ఉన్నత చదువుల కోసం సర్కీల్ ఏర్పాటు చేస్తానని కెసిఆర్ ప్రకటించటాన్ని స్వాగతించారు. సమాజంలో బ్రాహ్మణ వర్గం లోక కల్యాణం కోసం, శాంతి స్థాపన కోసం కృషిచేస్తారన్నారు. కెసిఆర్ చేపట్టిన అయుత చండీయాగం వల్ల ఫలితాలు స్పష్టంగా కనబడుతున్నాయన్నారు. గతంలో కెసిఆర్‌ను దూషించిన వారు సైతం టిఆర్‌ఎస్ పార్టీలో చేరి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారన్నారు. కెసిఆర్ గతంలో ప్రకటించినట్లుగా హైదరాబాద్‌లో 5 ఎకరాల్లో బ్రాహ్మణ సంక్షేమ భవానాన్ని నిర్మించాలని, ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయాలన్నారు.
మహా శివరాత్రి పర్వదినాన కెసిఆర్ పేరిట అభిషేకాలు
బ్రాహ్మణుల సంక్షేమానికి పాటుపడుతున్న సిఎం కెసిఆర్‌కు బ్రాహ్మణ సమాజం రుణ పడి వుంటుందన్నారు. మహా శివరాత్రి పర్వదినం రోజున రాష్ట్రంలోని అన్ని శివాలయాల్లో సిఎం కెసిఆర్ అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కెసిఆర్ ఆయురారోగ్యాలు, భవిష్యత్తు బాగుండాలని ప్రత్కేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ సంక్షేమానికి వంద కోట్లు కేటాయించటం పట్ల బ్రాహ్మణ సేవా సమాఖ్య పక్షన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బ్రాహ్మణుల ఆశీర్వాదం పొందిన వారు సమాజంలో ఉన్నత స్థాయికీ చేరుకుంటారన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే శక్తి సిఎం కెసిఆర్‌కే ఉందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో అన్ని వర్గాలు పాలుపంచుకోవాలని సూచించారు.