పశ్చిమగోదావరి

వెంపలో ముగిసిన సామరస్య రథయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 14: అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో చేపడుతున్న సామరస్య రథయాత్ర భీమవరం మండలంలోని వెంప గ్రామంలో గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా వెంప గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ప్రజ్ఞానంద సరస్వతి (బాల స్వామిజీ) పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ ఈ సామరస్య రథయాత్రకు మంచి స్పందన లభించిందన్నారు. సమరసతా వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు కలిదిండి బలరామకృష్ణంరాజు, కార్యదర్శి నేతల దేవదానం, రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఎస్ సహసంఘ్ చాలక్ మంతెన రామచంద్రరాజు, నక్కా చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.