పశ్చిమగోదావరి

ఉరివేసుకుని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 21 : స్థానిక నరసింహారావుపేటలోని ఒక హోటల్ రూంలో సి ఆర్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్ధి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హోటల్‌లో నమోదైన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన మోతుకూరి వంశీకృష్ణ(19) స్థానిక రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం గ్రాండ్ ఆర్య హోటల్‌లో 226వ రూమ్‌లో ఫ్యాన్‌కు తాడుకట్టుకుని మెడకు తగిలించుకుని ఉరివేసుకున్నాడు. ఎందుకు ఉరివేసుకున్నాడన్న విషయం తెలియరాలేదు. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వంశీకృష్ణ ఉరి వేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న కళాశాల విద్యార్ధులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వంశీకృష్ణది కర్నూలు జిల్లా అయ్యలూరు మెట్టగా పోలీసులు భావిస్తున్నారు.