వరంగల్

మంత్రిగా సేవలు అందిస్తాం: ఎర్రబెల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయపర్తి, సెప్టెంబర్ 21: మరోసారీ ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మం త్రినై గ్రామాలను మరింత అభివృద్ధి పరుస్తానని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని పెరుకవేడులో తెరాస పార్టీ విసృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి అన్ని రాష్టల్రు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు తీసుకవచ్చి అన్ని గ్రామాలను అభివృద్ధి చేశానన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలుకు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెరాస ప్రభుత్వం చెపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ సంక్షేమం కోసం కార్యకర్తలకు కృషి చేయాలని అన్నారు. వివిధ పార్టీలకు చెందిన 70 మంది కార్యకర్తలు ఎర్రబెల్లి సమక్షంలో తెరాస కండువలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనీమిరెడ్డి, సురేందర్‌రావు, నర్సింహా నాయక్, తాళ్లపల్లి సంతోష్ గౌడ్, అనిత, వనజారాణి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.