పశ్చిమగోదావరి

డిప్యూటీ మేయర్‌కు సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 30 : ఏలూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుడివాడ రామచంద్రకిషోర్‌ను మేయర్ షేక్ నూర్జహాన్ ఘనంగా సత్కరించారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం సాయంత్రం కిషోర్‌ను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి మేయరు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వ్యక్తిగత పనుల వలన శుక్రవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమంలో పాల్గొనలేకపోయామని, ఈ విషయంలో ఎటువంటి అపోహలకు తావులేదని చెప్పారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆశీస్సులతో నగరాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఒకేమాట, ఒకే బాటగా అందరూ సమిష్టి సహకారంతో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఇచ్చిన మాట ప్రకారం మేయరు పీఠాన్ని తనకు అప్పగించారని, డిప్యూటీ మేయరుగా నలుగురు పేర్లు ఆనాడే ప్రకటించారని, ఈ విషయంలో మరొకమాట లేదని బడేటి మాటకు కట్టుబడి అంతా ఐక్యతతో ముందుకు నడుస్తున్నామని చెప్పారు. కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల వలన డిప్యూటీ మేయరు ఎన్నికకు హాజరు కాలేకపోయామని చింతించామని కానీ కిషోర్‌కు సన్మానం చేసి గౌరవించి ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పారు. డిప్యూటీ మేయర్ రామచంద్రకిషోర్ మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన మేయర్ నూర్జహాన్, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, కార్పొరేటర్లకు రుణపడి ఉంటానని చెప్పారు. ఏలూరు నగరాభివృద్ధితోపాటు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి, సహకారం అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేషన్ విప్ గూడవల్లి శ్రీనివాస్, కార్పొరేటర్లు దాకారపు రాజేశ్వరరావు, బౌరోతు బాలాజీ, పోలిమేర దాసు, పునుకొల్లు పార్ధసారధి, నాయుడు పోతురాజు, వీరంకి త్రినాధ్, గోపాల్, గాడి నాగమణి, పెరుమాళ్ల హేమ శశికళ, ఎల్లపు సత్యవతి, బోరా జ్యోతి, మాగంటి వెంకట దుర్గా వాణి, నెరుసు సుగుణ, కేతినీడి భాస్కరరావు, రాగత నూకరత్నం, కో ఆప్షన్ సభ్యులు కొల్లేపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు, విప్ దుశ్శాలువాలతో డిప్యూటీ మేయర్‌ను ఘనంగా సత్కరించారు.