పశ్చిమగోదావరి

చంద్రబాబు కృషితో యువతకు ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 14 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలో సుమారు 55 వేల మంది నిరుద్యోగ యువత సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పొందగలిగారని ఎపి ఫిలిం, టివి అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అంబికా కృష్ణ చెప్పారు. 51వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా స్థానిక జిల్లా కేంద్ర గ్రంధాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్ధినీ విద్యార్ధులు, నిరుద్యోగ యువత విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన పరిజ్ఞానం కోసం పుస్తకాలను ఆశ్రయించాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అపార అనుభవం, చొరవ వల్ల రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెండుగా వున్నాయన్నారు. సినీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న చర్యల వల్ల ఇప్పటికే 15 సినిమాలు ఆంధ్రప్రదేశ్‌లో తయారవుతున్నాయని, ప్రత్యకంగా, పరోక్షంగా సుమారు 20 వేల మందికి ఉపాధి లభిస్తోందని చెప్పారు. కార్ల పరిశ్రమ కూడా అనంతపురంలో రాబోతోందని, వచ్చే డిసెంబరులో ప్రారంభోత్సవం అయ్యే అవకాశం వుందన్నారు. ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు అవసరమైన విజ్ఞానం యువత పెంపొందించుకోవాలన్నారు. ఉన్నత స్థితికి చేరిన అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత గాధలు తెలుసుకోవడం ద్వారా విద్యార్ధుల్లో ఆసక్తి, సమాజం పట్ల అవగాహన పెంపొందుతుందన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ గ్రంధాలయాలను ఉపయోగించుకోవాలన్నారు. గ్రంధాలయాలలో బయట దొరకని అనేక రకాల పుస్తకాలు అందుబాటులో వుంటాయని చెప్పారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ దేవాలయాలకంటే గ్రంధాలయాలు గొప్పవన్నారు. గ్రంధాలయాలు ఉపయోగించుకోవడం ద్వారా ఎంతో మంది తమ జీవితాలను గొప్పగా మలుచుకున్నారన్నారు. రాస్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పాలి ప్రసాద్ మాట్లాడుతూ గ్రంధాలయాలు లేని ఊరు ఉండదని, విద్యార్ధినీ విద్యార్ధులు ప్రతి రోజు కనీసం ఒక గంట అయినా పుస్తక పఠనం చేయాలన్నారు. సమయం వృధా చేసుకోకుండా గ్రంధాలయాలకు వెళ్లి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. జాతీయ గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా ఈ నెల 20వ తేదీ వరకు వివిధ అంశాలలో నిర్వహించనున్న వక్తృత్వ, మహిళాభ్యుదయ గీతాలు, వ్యాసరచన వంటి పోటీలలో విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొనాలని కోరారు. సమాచార శాఖ సహాయ సంచాలకులు కె సుభాషిణి మాట్లాడుతూ మన దేశం ఆధ్యాత్మిక దేశమని అందరికీ శాంతి, విజ్ఞానం అవసరమని చెప్పారు. శాంతి ద్వారా ఏ పని అయినా సాధించుకోవడంతోపాటు సమన్వయం ఏర్పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ విప్ గూడవల్లి శ్రీనివాస్, వయోజన విద్య ఉపసంచాలకులు వైవి ఎస్ సూర్యనారాయణ, ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. అంబికా కృష్ణ తదితరులు ముందుగా చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన అనంతరం సభను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంధాలయ సంస్థ కార్యదర్శి శ్రీనివాసరావు, ప్రజా నాట్య మండలి ఉపాధ్యక్షులు నాగాస్త్,్ర అధిక సంఖ్యలో విద్యార్ధినీ విద్యార్ధులు, పాఠకులు పాల్గొన్నారు.