వరంగల్
వడదెబ్బతో ఇద్దరు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 8 April 2016
కురవి, ఏప్రిల్ 7: వడదెబ్బ తగిలి కురవి మండలంలో నల్లెల్ల గ్రామంలో కల్లూరి గోవిందమ్మ(44), మోద్గులగూడెం గ్రామంలో చింతమల్ల స్వామి(60)లు గురువారం మృతిచెందారు. మృతురాలు గోవిందమ్మ మానసిక వికలాంగురాలు, ఎండవేడిమికి బుధవారం రాత్రి అస్వస్థతకు గురైంది. మృతురాలికి కొడుకు రాము ఉన్నాడు. మోద్గులగూడెం గ్రామానికి చెందిన చింతమల్ల స్వామి కట్టెలు కొట్టేందుకు గురువారం బయటకు వెల్లి తీవ్రఅస్వస్థతకు గురై, ఇంటికి వచ్చిన తరువాత మృతిచెందాడు. మృతుడికి నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు.