వరంగల్

రైతు ఆత్మ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగెం, డిసెంబర్ 10: పెట్టుబడులు, పిల్లల పెళ్లిల కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడిన సంఘటన లోహిత గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై దీపక్ తెలిపిన వివరాల ప్రకారం లోహిత గ్రామానికి చెందిన కత్తి రవి యాదమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇతనికి ఉన్న కొద్ది పాటి భూమిలో పంటలు సాగుచేస్తూ ఇద్దరు కూతుళ్ల వివాహాలు చేశారు. కూతుళ్ల వివాహాలు, పెట్టుబడుల కోసం సుమారు 11 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఆశించిన మేరకు పంట దిగుబడి రాక పెట్టిన పెట్టుబడులు, కూతుళ్ల వివాహాలకు చేసిన అప్పులు ఎలా తీర్చాలని దిగులుతో కత్తి రవి(45) ఈ నెల 5న ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వరంగల్ లోని ఎంజిఎమ్‌కి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్టు ఆయన తెలిపారు. మృతుడి భార్య యాదమ్మ ఫిర్యాదు మేరక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

తల్లి మందలించడంతో
కుమారుడి ఆత్మహత్య
సంగెం, డిసెంబర్ 10: తల్లి కుమారుడిని మందలించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో జరిగింది. సంగెం ఎస్సై దీపక్ తెలిపిన వివరాల ప్రకారం కాట్రపల్లికి చెందిన చెన్నూరు కుమారస్వామి రేణుక దంపతుల కుమారుడు అఖిల్(19) పనీపాటా లేకుండా ఉదోగ్యం చూసుకోకుండా తిరుగుతున్నావని తల్లి మందలించడంతో అఖిల్ మనస్థాపానికి గురై ఈ నెల 4న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి తన బావ సాంబయ్యకు ఫోన్ చేసి పురుగుల మందు తాగినట్టు తెలిపాడు. వెంటనే సాంబయ్య, కుటుంబ సభ్యులు చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజిఎమ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అఖిల్ ఆదివారం మృతిచెందినట్టు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.