వరంగల్

మార్చి 15లోగా హైవేల పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 16: వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారి పనులను వచ్చే మార్చి 15లోగా పూర్తి చేయాలని రోడ్ల భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం మంత్రి హైదరాబాద్ నుండి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారుల పురోగతిపై సమీక్షించారు అనంతరం మాట్లాడుతూ వరంగల్ రూరల్, అర్భన్ జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారుల పనులు వేగవంతం చేయాలని ఆయన కలెక్టర్లను అదేశించారు. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేటలో రోడ్ల నిర్మాణ పనులు, భూసేకరణ విషయంలో జాప్యం జరుగుతందని త్వరితగతిన నిర్మాణానికి సంబంధించిన స్థల సేకరణపై మంత్రి ఇన్‌చార్జి కలెక్టర్‌ను ఆరా తీసారు. ఈ సందర్భంగా వరంగల్ రూరల్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం. హరిత మట్లాడుతూ నర్సంపేటలో కోర్టు వివాదం కారణంగా స్థల సేకరణలో జాప్యం జరిగిందని, ప్రస్తుతానికి స్థలం అప్పగించామని అమె తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లాలో రింగ్ రోడ్డుకు స్థల సేకరణలో జాప్యం జరగుతుందని, ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి పరిపాలన అనుమతులు ఉన్నా జాప్యం ఎందుకు జరగుతుందని ప్రశ్నించారు. అదేవిధంగా భట్టుపల్లి జాతీయ రహదారికి స్థల సేకరణ చేసి ప్రతిపాదన పంపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలుపగా, దీనికి వరంగల్ అర్బన్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ దయానంద్ సమాధానమిస్తూ.. ఈనెల 25లోగా స్థల సేకరణ త్వరితగతిన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఆండ్‌బి సూపరింటెండెంట్ ఇంజనీర్ సత్యనారాయణ ఈఈ లక్ష్మణ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.