క్రైమ్/లీగల్
లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వరంగల్ క్రైం, సెప్టెంబర్ 19: తెలంగాణ రాష్ట్ర కమిటీ సీపీఐ మావోయిస్టు పార్టీ సీఆర్బీ(సెంటర్ రీజినల్ బ్యూరో) ప్రెస్టీం సభ్యుడు కడవంచ యాకస్వామి బుధవా రం వరంగల్ పోలీసు కమిషనర్ విశ్వనాథ రవీందర్ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పోలీసు కమిషనర్ మావోయిస్టు పార్టీ దళసభ్యుడు లొంగుబాటు వివరాలను వెల్లడించారు. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తిమ్మంపేటకు చెందిన కడవంచ యాకస్వామి స్వగ్రామంలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. ఇంటర్మీడియట్ జఫర్గడ్ మండల కేంద్రంలో పూర్తి చేసిన పిమ్మట 2008లో యాకస్వామి వివాహం చేసుకున్నాడు. ఇదే సంవత్సరంలో మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ ప్రజావేదిక సభ్యులతో పరిచయం ఏర్పడింది. 2013 నుండి ప్రజావేదికలో పూర్తిస్థాయిలో పనిచేస్తూ 2016లో జనగామ జిల్లా కమిటీ కార్యదర్శిగా పనిచేసాడు. ప్రజావేదిక నాయకుల ప్రోత్సాహంతో 2018-జనవరిలో మావోయిస్టు పార్టీలో చేరినప్పటినుండి తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ ఆలియాస్ హరిభూషణ్ ప్రొటెక్షన్ టీం సభ్యునిగా ఐదుమాసా లు పనిచేసాడు. జూన్ నెలలో మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ అయిన ప్రెస్టీంకు బదిలీ అయ్యాడని వెల్లడించారు.