వరంగల్

అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ సరే..! అప్పుడేం చేశారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 24: ఇప్పుడు అధికారంలోకి వస్తే రైతు రణమాఫీ సరే, అప్పుడు అధికారంలో ఉండి గడ్డిపీకారా అని డీప్యూటీ సీఎం కడి యం శ్రీహరి అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శాయంపేటలో జరిగిన నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన డిప్యూటీ సీఎం కడియం మాట్లాడుతూ.. స్పీకర్ మధుసూధనాచారిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. మనకు ఉపయోగపడే అభ్యర్థిని గెలిపించే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పారు. మన ఊర్లో పచ్చదనాన్ని తీసుకొచ్చే నాయకుడు కావాలా, మనను దోచుకునే దొంగలు కావాలో మీరే నిర్ణయించుకోవాలని అన్నారు. మన వనరులను దోచుకుని పెట్రోల్ బంకులు పెట్టుకున్నారని, దోపిడీ చేసి న సొమ్ము పంచి పెడుతామని అంటున్నారని ఎద్దేవా చేశారు. వారికి పొరపాటున ఒక్కసారి అవకాశమిస్తే అవినీతి, అక్రమాలు ఆగవన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో అమ లు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి దేశమంతటా మాట్లాడుకుంటున్నారని తెలిపారు. నాలుగేళ్లలో ఒక్కసారి అయినా కరెంట్ కోతల వల్ల పంటలు ఎండిపోయిన పరిస్థితి ఉందా అని, 24 గంటలు ఉచిత కరెంట్ వ్యవసాయానికి ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఇప్పడు అధికారంలోకి వస్తే రైతు రుణం మాఫీ చేస్తామంటున్నారని, అధికారంలో ఉన్న సమయంలో ఏమి చేసారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం పెట్టి ఏటా రూ.12వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. రైతు ఏ కారణంతో చనిపోయిన వారి కుటుంబానికి ఆదుకునేందుకు రూ.5లక్షల బీమా సౌకర్యం అందిస్తున్న ఎకైక ప్రభుత్వం మనదేనన్నారు. వచ్చేసారి రైతు కూలీ కుటుంబాలకు కూడా ఈ బీమా సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పెడుతున్నామన్నారు. కంటి వెలుగు పథకం కింద 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించాలన్న ఆలోచన ఈ దేశంలో ఇప్పటి వరకు ఎవరికైన వచ్చిందా అని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. 8 లక్షల గొల్ల, కుర్మలకు రూ.10 వేల కోట్ల రూపాయలతో గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించి ఇప్పటికే 3.20 లక్షల మందికి ఇచ్చామని వెల్లడించారు. మధుసూధనాచారి స్పీకర్‌గా ఉన్నందువల్లే వందల కోట్ల రూపాయలు భూపాలపల్లి అభివృద్దికి తెచ్చారని గుర్తు చేశారు. మళ్లీ మంచి మెజార్టీతో ఆయనను గెలిపిస్తే ఇంతకంటే గొప్ప స్థాయిలో ఉంటారు అని అన్నారు. మధుసూధనాచారిని మరోసారి గెలిపిస్తే భూపాలపల్లిని గజ్వెల్ స్థాయికి అభివృద్ధి చేస్తారని కోట్లాడి నిధులు తెస్తారని తెలిపారు. సమావేశంలో ఎంపీ బండ ప్రకాశ్, టీఆర్‌ఎస్ నాయకులు సమ్మారావు, స్థానిక నేతలు పాల్గొన్నారు.