క్రైమ్/లీగల్

గోదావరి నదిలో ముగ్గురి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్, నవంబర్ 21: మహారాష్ట్ర నుండి పవిత్ర పుణ్య క్షేత్రమైన కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చిన 10 మంది భక్తుల్లో ముగ్గురు త్రివేణి సంగమం గోదావరి ఒడ్డున గల్లంతైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానిక కాళేశ్వరం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మహారాష్ట్ర నుండి చంద్రాపూర్ జిల్లా స్తంబర్ల కాలిక, చింతల బాబాకు చెందిన 10 మంది యువకులు కాళేశ్వరంకు దైవ దర్శనానికి వచ్చి ముగ్గురు మృత్యువాత పడ్డారు. దైవ దర్శనానికి ముందు పుణ్య స్నానాలు ఆచరించడానికి త్రివేని సంగమం గోదావరి నందు విఐపి పుష్కర ఘాట్ వద్ద స్నానా లు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. గల్లంతైన వారిలో కుడిమేత అనిల్ (28) ఇతను పోలీస్ కానిస్టేబుల్‌గా గరోరలొ పనిచేస్తున్నట్లు, పోరిక మహేందర్ (23), పటికె రోహిత్ (21) వీరు గోదావరిలో గల్లంతైనట్లు కాళేశ్వరం ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ప్రమాద ఘటన చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి ఆచూకి కోసం స్థానిక జాలర్లతో గాలింపు చేపట్టగా ఫలితం లేకపోయింది. సాయంత్రం చీకటి కావడంతో గల్లంతైన వారి ఆచూకి తెలియరాలేదని పోలీసులు తెలిపారు.