వరంగల్

రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, డిసెంబర్ 17: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆగిపోయిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని 19వ తేదీ నుంచి నిర్వహించేందుకు జిల్లాలో అధికార యంత్రాంగం సమాయత్తం అవుతుంది. మళ్లీ గ్రామపంచాయతీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అంతకు ముందే చీరల పంపిణీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో జిల్లాలోని 16 మండలాల్లో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని 16 మండలాలకుగాను 2,31,553 చీరలను మహిళలకు అందజేయాల్సి ఉంది. ఇప్పటికే మహబూబాబాద్ గోదాంలో 75వేలు, తొర్రూరు డివిజన్ కేంద్రంలో 68,200చీరలు పంపిణీ కోసం సిద్ధంగా ఉన్నాయి. ముందస్తు ఎన్నికల కోడ్‌తో బతుకమ్మ పం డుగకు అందని చీరలు నూతన సంవత్సర కానుకగా తమ ఇంటికి రానున్నాయని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలాల వారిగా లెక్కతేల్చి చీర లను గ్రామాలకు చేర్చే పనిలో ప్రస్తుతం అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది. మహబూబాబాద్ డివిజన్‌లోని 9 మండలాలకు 1,41,400 చీరలు, తొర్రూరు డివిజన్‌లోని 7 మండలాలకు 90,072 చీరలను కేటాయించారు. అందులో జిల్లాకు ఇప్పటి వరకు 1,43,200 చీరలు వచ్చాయి. మిగతా 88,353 చీరలను కూడా జిల్లాకు తెప్పించే పనిలో ప్రస్తుతం ఉన్నారు. రేషన్‌షాపుల ద్వారా, గ్రామ సంఘాల ద్వారా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రప్రభుత్వం పండుగలకు బహుమతులు అందజేయడం రాష్ట్రప్రభుత్వం ఆనవాయితీగా పెట్టుకుంది. ముస్లింలకు రంజాన్ పండుగరోజు నూతన దుస్తులతోపాటు ఇఫ్తార్ విందులు నిర్వహిస్తుంది. అదేవిధంగా క్రిస్టియన్‌ల కోసం క్రిస్మస్ పండుగకు నూతన దుస్తులను అందిస్తుంది. హిందువులకు బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ చీరలపంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. గత సంవత్సరం ప్రారంభమైన ఈ పథకం కొన్ని విమర్శలను ఎదుర్కొంది. నాణ్యతలేని చీరలను ఇచ్చిందనే అపవాదులను రాష్ట్ర ప్రభుత్వం మూటకట్టుకుంది. కాని ఈ సంవత్సరం ఆ విమర్శలకు తావులేకుండా నాణ్యమైన చీరలు అందించే విధంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గురించి హైదరాబాద్ నుండి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలెందర్‌కుమార్ జోషి జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ మూలంగా కొంత ఆలస్యం అయినప్పటికీ చీరలు అందనున్నాయని తెలియడంతో జిల్లావ్యాప్తంగా మహిళల్లో ఆనందం వ్యక్తం అవుతుంది.

బతుకమ్మ చీరలు బల్క్‌గా ఇవొద్దు
వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా 3,15,500 చీరల పంపిణీ: కలెక్టర్

వరంగల్, డిసెంబర్ 17: జిల్లాలోని 18 సంవత్సరాల నిండి న 3,15,500 మంది పేద మహిళలకు ఈ నెల 19 నుండి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ రేషన్ షాపుల వారిగా లబ్ధిదారులకు స్లీప్పులు జారీ చేయనున్నట్లు తెలిపారు. రెండు, మూ డు రోజులలో పంపిణీ ప్రక్రియను పూర్తి చేసేందుకు రేషన్ షాపు, వార్డుల వారిగా లబ్ధిదారులను పిలువాలని తెలిపా రు. జిల్లాలోని 130 గ్రామ పంచాయతీలలో ఒకే రోజు పంపిణీ ప్రారంభించాలన్నారు. అలాగే మున్సిపల్ వార్డుల లో నిర్ధేశిత ప్రాంతాలలో పంపిణీ చేయాలన్నారు. బల్క్‌గా ఇవ్వరాదని స్పష్టం చేశారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులు స్లీప్పులను తీసుకువస్తే నిర్ధారించుకుని బతుకమ్మ చీరలను అందజేయాలని కోరారు. ప్రతి బండిల్‌లో వేరు వేరు రం గుల కల్గిన 160 చీరలు ఉంటాయని తెలిపారు. నాణ్యతను పరిశీలించి మహిళలకు అందజేయాలని కోరారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ యస్ దయానంద్, ఆర్‌డివో వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.