వరంగల్

19 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, డిసెంబర్ 17 : ఈనెల 19 నుండి బతుకమ్మ చీరల పంపిణి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లును ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ చీరల పంపిణి తో పాటు క్రిస్మస్ వేడుకల నిర్వహణ, గ్రామ పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించాలని జోషి అన్నారు. అదేవిధం గా పంచాయతీ కార్యదర్శుల నియామ కం, కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణితో పాటు ప్రభుత్వం నూతనంగా వృద్దులకు 57 సంవత్సరాల నుండే ఫించన్ అందించనుంద ని, అర్హులైన వృద్దులను గుర్తించి జాబి తా సిద్దం చేయాలన్నారు. బతుకమ్మ చీరల పంపిణికి శాసన సభ్యులను ఆహ్వానించాలని, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తుది ఓటరు జాబితాను సిద్దం చేసి జిల్లాల వారిగా బీసీ జనాభా వివరాలను సేకరించి తుది జాబితా సిద్దం చేయాలన్నారు. ఎంపికైన పంచాయతీ కార్యదర్శుల జాబితాను జిల్లాకు పంపించడం జరుగుతుందని, వారి దృవపత్రాలను పరిశీలించి వెంటనే నియామక ఉత్తర్వులను అందించాలని ఆదేశించారు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పలు అంశాలపై జోషికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సం యుక్త కలెక్టర్ స్వర్ణలత, జిల్లా పంచాయితీ అధికారి చంద్రవౌలి, డిఆర్ డివో సంజీవరావు, భాగ్యలక్ష్మి, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

రైలు బోగీల దగ్ధంపై విచారణ కమిటీ
కాజీపేట, డిసెంబర్ 17:కాజీపేట రైల్వేయార్డులో రెండు బోగీల దగ్ధంపై విచారణ కమిటీని రైల్వే ఉన్నతాధికారులు నియమించారు. కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలోని శనివారం అర్ధరాత్రి దాటాక నిరూపయోగంగా ఉన్న ఫ్యాసింజర్ రైలు అగ్నికి ఆహూతి అయిన విషయం విధితమే. ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు విచారణ కమిటీని నియమించారు. రైల్వే పోలీసు అసిస్టెంట్ కమీషనర్ శ్రీనివాస్,కాజీపేట రైల్వే స్టేషన్ మాస్టర్ లక్ష్మీనారాయణ,రైల్వే ఏరియా అధికారి పూర్ణచందర్,క్యారెజ్ అండ్ వ్యాగన్ సెక్షన్ డిపో ఇన్‌చార్జీ యమునాకర్‌రెడ్డిలను విచారణ కమిటీలో నియమించారు.

గైర్హాజరైన అధికారులకు షోకాజ్
జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలి: గ్రీవెన్స్‌డేలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

వరంగల్, డిసెంబర్ 17: ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో ఉద యం 10.30 గంటలకు నిర్వహించే ప్రజావాణికి జిల్లా అధికారులందరు సకాలంలో హాజరుకావాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం సోమవారం జరిగిన ప్రజావాణికి పలువురు అధికారులు హాజరుకాలేదు. ఆయా శాఖల నుండి క్రింద స్థాయి ఉద్యోగులు హాజరై ప్రజావాణి రిజిస్టర్‌లో సంతకాలు చేశా రు.ఆలస్యంగా వచ్చిన అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపట్ల కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్కూల్ విద్యార్ధులలాగా ప్రవర్తించవద్దని సూచించారు. ఇక నుండి ప్రతి సోమవారం ఎటువంటి సమావేశాలు, పర్యటనలు పెట్టుకోరాదని స్పష్టం చేశారు. ప్రజావాణి రోజు ఎవరికి సెలువు ఉండవని ఆయన వెల్లడించారు. అనంతరం కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ వివరాలను అందజేయాలని సంబందిత అధికారులను కలెక్టర ఆదేశించారు. శాఖల వారీగా మంజూరు చేసిన యూనిట్లు, గ్రౌండింగ్ నివేదకను సమర్పించాలని, జాప్యానికి కారణాలను పేర్కొనాలని ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసినప్పటికి బీసీ సంక్షేమ శాఖ యూనిట్లు మంజూరు ప్రతి పాదనలు సిద్దం చేయకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారినిక జిల్లా అధికారులు వ్యక్తిగత చొరవతో పరిశీలించాలని ఆదేశించారు. అదే విధంగా రూరల్ జిల్లాలో కలెక్టరేట్‌లో సోమవారం జేసీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి దృష్టికి వచ్చిన సమస్యలను విని సమస్యల పరిష్కారానికి పాటుపడాలని అధికారులకు ఆయన సూచించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో బల్దియా కమీషనర్ వీపీ గౌతమ్ పాల్గొని ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా సంయుక్త కలెక్టర్ యస్ దయానంద్, డీఆర్‌వో కృష్ణవేణి, కే వెంకా రెడ్డి, జెడ్‌పిసీ ఈవో విజయ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.