వరంగల్

క్రిస్మస్ పండుగకు నియోజకవర్గానికి 1000 గిఫ్ట్ ప్యాకెట్లు: అర్బన్ కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హంటర్‌రోడ్, డిసెంబర్ 17: క్రిస్మస్ పండుగ సంబురాల్లో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 1000 మంది, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 1000 మందికి గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేయనునట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. అలాగే నియోజకవర్గానికి 1000 మందికి క్రిస్మస్ విందును ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, చర్చి మతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గిఫ్ట్ ప్యాకెట్‌లో ఒక ప్యాంట్, ఒక షర్ట్, ఒక చీర, షాల్వార్‌కమీజ్, చున్నీ ఉంటాయని తెలిపారు. గిప్ట్ ప్యాకెట్ల పంపిణీకి నియోజకవర్గాల వారిగా కమిటీలను ఏర్పాటు చేసి, ప్రత్యేక బ్యాంక్ ఖాతాలను తెరవాలని తెలిపారు. వరంగల్ పశ్చిమకు ఆర్‌డీవో వెంకారెడ్డిని, వరంగల్ తూర్పుకు డిప్యూటీ కమీషనర్ బ్రహ్మయ్యను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20న గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీకి ఈ కార్యక్రమాలను చేపట్టుటకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేయాలని ఆయన సూచించారు. నియోజకవర్గానికి ఒక చోటనే పండుగ వాతావరణం ప్రతిభింబే విధంగా గిప్ట్ ప్యాకెట్ల పంపిణీ, విందు భోజనాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపికలో హెచ్‌ఐవీ, బాధిత వ్యక్తులు, ఆనాథలు, వితంతువు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. జిల్లాలోని ప్రతి చర్చి పరిధి నుండి లబ్ధిదారులు ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎస్ దయానంద్, డీ ఆర్‌వో కృష్ణవేణి, జెడ్పీ సీఈవో విజయ్‌గోపాల్, డీఆర్‌డీవో రాము, జిల్లా మైనార్టీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రైతు రత్న అవార్డుకు దరఖాస్తులు
భూపాలపల్లి టౌన్, డిసెంబర్ 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రైతులు రైతు రత్న అవార్డుల ఎంపికకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు సత్యంబాబు తెలిపారు. అవార్డు ఎంపిక తెలంగాణ విశ్రాంత వ్యవసాయ అధికారుల సంఘం, తెలంగాణ వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. ఉత్తమ రైతులు ఈ నెల 20వ తేది లోపు ఆయా మండలాల వ్యవసాయాధికారికి దరఖాస్తులు అందజేయాలని కోరారు.

కేటీఆర్ తెరాసను తిరుగులేని శక్తిగా మారుస్తారు: చల్లా
పరకాల, డిసెంబర్ 17: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వహక అధ్యక్షులు కె. తారకరామారావు తెలంగాణ రాష్ట్ర సమితిని తిరుగులేని రాజకీయ శక్తిగా మారుస్తారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులుగా కేటీఆర్ ఎన్నికైన తరువాత మొదటి సారిగా వరంగల్‌కు ఈనెల 20న వస్తున్నారని చెప్పా రు. వరంగల్‌కు వస్తున్న కేటిఆర్‌కు ఘన స్వాగతం పలకాలని కార్యకర్తలకు, నాయకులకు చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 20న హైగ్రీవాచారి మైదానంలో మధ్యాహ్నం 1 గంటకు వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాకు సంబందించిన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కేటిఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెరాస సత్తా చాటేలా వ్యహ రచన చేయడమే కాకుండా తగు కార్యచరణ గురించి కార్యకర్తలతో మాట్లాడుతారని తెలిపారు. స్థానిక సంస్థల్లో వంద శాతం సీట్లు సాధించే లక్ష్యంతో కార్యచరణ రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశానికి గ్రామ శాఖ అధ్యక్షులు, బూతు కమిటీ కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలన్నారు.