వరంగల్

కెసిఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: స్పీకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, సెప్టెంబర్ 29: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గురువారం పరకాల పట్టణంలో ఎంఎన్‌ఆర్ గార్డెన్‌లో ఎస్‌వి కళాశాల యాజమాన్యం నిర్వహించిన వేడుకలలో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరైన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ ప్రపంచమే తెలంగాణ వైపు చూసేలా కెసిఆర్ చేశారని తెలిపారు. తాను రాజకీయాల్లోకి రాకపోతే కళాశాలలను స్ధాపించేవాడినని చెప్పారు. నేడు విద్య అందరికి అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇప్పుడు ఉన్న యువత అదృష్టవంతులని మా రోజుల్లో కళాశాలలు లేవని ఇప్పుడు వౌలిక వసతులు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.