వరంగల్

ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, అక్టోబర్ 13: అధికారులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వారి ఇబ్బందులను అర్థం చేసుకొని పరిష్కారం కోసం తమ స్థాయిలో కృషి చేయాలని కలెక్టర్ దేవసేన అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ మండలాల తహశీల్దార్లు, ఎంపిడివోలకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కార్యాలయంలో రికార్డులు తప్పనిసరిగా భద్రపర్చి అవసరమైన సమయంలో తెచ్చేందుకు అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాల్ని నిజమైన లబ్దిదారులకు చేరవేయడంలో అధికారుల పాత్ర ప్రధానమైందని అన్నారు. విధులను సమర్థవంతంగా నిర్వహించి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ప్రసాద్‌రావుతో పాటు ఆర్డీవో వెంకట్‌రెడ్డిలు పాల్గొన్నారు.