జాతీయ వార్తలు
30న వంచన దినం: వైకాపా నిర్ణయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 April 2018
అమరావతి: ఈ నెల 30వ తేదీని వంచన దినంగా చేపట్టాలని వైకాపా ప్రకటించింది. ఆ రోజున విశాఖపట్నంలో వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు నిరాహార దీక్ష చేపట్టాలని వైకాపా కోర్ కమిటీ నిర్ణయించింది. ప్రత్యేకహోదా వద్దని నాలుగేళ్ల నుంచి చెప్పి...ఇప్పుడు మాత్రం ప్రధాని మోదీ ఇవ్వనందుకు 30న తిరుపతిలో నిరసన సభ అంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయాలను ప్రజలకు వెల్లడించేందుకు అదే రోజునే వంచన దినం చేపట్టాలని ఈ కమిటీ నిర్ణయించింది. పార్టీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాదరావు, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విలేకరులతో మాటాడుతూ భాజపా విధానం, చంద్రబాబు మోసాన్ని ప్రజలకు వెల్లడిస్తామన్నారు.