-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: రామజన్మ భూమి, బాబ్రీ మసీదు వివాదంపై రోజువారీగా జరుగుతున్న విచారణను ప్రత్యక్షంగా ప్రసారం చేయడం సాధ్యమో కాదో తెలియజేయాలని సుప్రీంకోర్టు సోమవారంనాడు రిజిస్ట్రీని ఆదేశించింది. సాధ్యమైతే ఇందుకు ఎంత సమయం పడుతుందో కూడా తమకు నివేదించాలని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం రిజిస్ట్రీని కోరింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: జమ్మూకాశ్మీర్కు సంబంధించి కీలక కేసులను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. 370 అధికరణ రద్దు, రాష్టప్రతి పాలన విధింపు రాజ్యాంగబద్ధత, ఆంక్షలు తదితర అంశాలపై దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు ఎస్ఏ బాబ్డే, ఎస్ అబ్దుల్ నజీర్తో కూడిన రాజ్యాంగ బెంచ్ విచారిస్తుంది.
ముంబయి, సెప్టెంబర్ 15: బ్యాంకును బురిడీ కొట్టించిన బంగారం విలువ కట్టే వాల్యుయర్ను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ కస్టమర్లను సృష్టించి, నకిలీ బంగారం పెట్టించి ఏకంగా రూ.3.77 కోట్ల రూపాయలను ఆ బ్యాంకు నుంచి తీసుకుని జల్సా చేసిన వాల్యుయర్ ఇప్పుడు కటకటాలపాలయ్యాడు.
బెట్టిహ (బీహార్) : బీహార్లో ఘోరం జరిగింది. నడుస్తున్న వాహనంలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. నలుగురు వ్యక్తు లు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ అత్యాచార వార్త దావానంలా వ్యాపించడంతో రాష్ట్రంలో కలకలం చెలరేగింది.
మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 15: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆదివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం బందరు మండలం గోకవరం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పెదపట్నం గ్రామానికి చెందిన దండే ప్రసాద్ (18), గుంటూరు సాగర్లో ద్విచక్ర వాహనం వస్తుండగా ఎదురు వస్తున్న కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ప్రసాద్ మృతి చెందగా గుంటూరు సాగర్ తీవ్రంగా గాయపడ్డాడు.
షాద్నగర్ రూరల్, సెప్టెంబర్ 15: భార్యభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో భర్త తలపై భార్య రాయితో మోది హత్య చేసిన సంఘటన ఫరూఖ్నగర్ మండలం కందివనం గ్రామంలో చోటు చేసుకుంది. షాద్నగర్ సీఐ శ్రీ్ధర్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి కందివనం గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల విష్ణుమూర్తి, శారద దంపతులు ఘర్షణ పడినట్లు తెలిపారు.
ఆదోని టౌన్, సెప్టెంబర్ 14: పేకాటరాయుళ్లను తారుమారు చేసి అడ్డంగా దొరికిపోయారు కర్నూలు జిల్లా కోసిగి పోలీసులు. విషయం ఎస్పీ దృష్టికి రావడంతో నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు.
చింతూరు, సెప్టెంబర్ 14: తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం మామిళ్లగూడెం గ్రామంలో శనివారం సాయంత్రం చెరువులో స్నానానికి దిగిన ఇద్దరు బాలురు నీట మునిగి మృతిచెందారు. ముచ్చిక దుర్గాప్రసాద్ (8), ముచ్చిక హర్షవర్థన్ (8) ఈ ఘటనలో మృతిచెందారు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లినపుడు ఈ ప్రమాదం జరిగింది.
గన్నవరం, సెప్టెంబర్ 14: జాతీయ లోక్ అదాలత్ లో 10 సివిల్, 66 క్రిమినల్ కేసులు పరిష్కరించారు. శనివారం స్థానిక కోర్టులో లోక్ అదాలత్ ద్వారా గన్నవరం సీనియర్ సివిల్ జడ్జి ఎ అనిత, న్యాయవాది దాసరి భాగ్యలక్ష్మితో కూడిన మొదటి బెంచ్, అదన పు జూనియర్ సివిల్ జడ్జి డి షర్మిల, న్యాయవాది వేణుబాబుతో కూడిన రెండో బెంచ్ల ద్వారా సివిల్, క్రీమినల్ కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
మచిలీపట్నం, సెప్టెంబర్ 14: జిల్లా కేంద్రం మచిలీపట్నం శివారు హర్ష జూనియర్ కళాశాల సమీపంలో కొనసాగుతున్న ఓ స్వచ్చంద సేవా సంస్థకు చెందిన హాస్టల్ కం స్కూల్లో నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థిని శనివారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. బెరాకా మినిస్ట్రీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ హాస్టల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.