S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/23/2019 - 23:27

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ట్రిపుల్ తలాక్ రద్దుచేస్తూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు స్వీకరించింది. దాన్ని పరిశీలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ముస్లిం వివాహితకు ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడం కొత్త చట్టంలో తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. చట్టం కింద సదరు భర్తకు మూడు నెలలు జైలుశిక్ష పడుతుంది.

08/23/2019 - 23:24

న్యూఢిల్లీ, ఆగస్టు 23: కేంద్ర హోం మంత్రి పేరిట ఇచ్చే ప్రతిష్టాత్మకమైన మెడల్‌కు 15 మంది సీబీఐ అధికారులు ఎంపికయ్యారు. పరిశోధనలో అత్యున్నత సమర్థత కనిపించిన 15 మంది అధికారులు ఈ ఏడాది (2019)కి ఎంపికయ్యారని సీబీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశ వ్యాప్తంగా 96 మంది ఎంపిక కాగా అందులో 15 మంది సీబీఐ అధికారులు ఉన్నారు.

08/23/2019 - 23:16

మేదరమెట్ల, ఆగస్టు 23: నిషేధిత పొగాకు ఉత్పత్తులైన గుట్కా, ఖైనీల ప్యాకెట్లు, వాటిని తయారుచేసే యంత్ర పరికరాల రాకెట్‌ను పోలీసుల చేధించిన సంఘటన ప్రకాశం జిల్లా మేదరమెట్ల గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఈసందర్భంగా మేదరమెట్ల గ్రామానికి విచ్చేసిన జిల్లా ఎస్‌పీ సిద్దార్ధకౌశల్ గుట్కాలు, ఖైనీలు తయారుచేసే యంత్రాన్ని, గోదామును పరిశీలించారు.

08/23/2019 - 23:10

తిరుపతి, ఆగస్టు 23: తిరుమల నుంచి తిరుపతికి ద్విచక్ర వాహనంలో వస్తున్న సత్యనారాయణపురం, రాజీవ్ నగర్‌కు చెందిన ఎస్.దామోదరాచారి (45)ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటనలో వాహనం నడుపుతున్న ఆచారి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.

08/23/2019 - 06:38

హైదరాబాద్, ఆగస్టు 22: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులకు పోస్టల్ సర్వీస్ ద్వారా పార్శిల్‌లో మురుగునీరు బాటిల్స్ పంపిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా అతడిని సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించిన ఉత్తర మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

08/23/2019 - 06:20

జగిత్యాల: అవినీతి నిరోధక శాఖ వలలో అవినీతి చేపలు పట్టుబడడం జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం కలకలం రేపింది. జిల్లా మత్స్యశాఖ అధికారి రాణాప్రతాప్, సీనియర్ అసిస్టెంట్ నూరొద్దీన్ ఖాజా రూ.60వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో సీఐలు సంజీవ్, రాము, వేణుగోపాల్ పకడ్బందీగా దాడి చేసి పట్టుకున్నారు.

08/23/2019 - 05:34

ముంబయి, ఆగస్టు 22: మహారాష్ట్ర స్టేట్ సహకార బ్యాంక్ (ఎంఎస్‌సీబీ) కుంభకోణం కేసులో ఎన్‌సీపీ నాయకుడు అజిత్ పవార్, మరో 70 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని బొంబాయి హైకోర్టు గురువారం ముంబయి పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగాన్ని (ఈఓడబ్ల్యూ) ఆదేశించింది. ఈ కేసులో అజిత్ పవార్ తదితరులకు వ్యతిరేకంగా విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది.

08/23/2019 - 02:23

పెనమలూరు, ఆగస్టు 22: వరకట్నం కోసం భర్త నిత్యం పెట్టే వేధింపులు భరించలేక ఓ గృహిణి నిండు ప్రాణాలు బలయ్యాయ. సంఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురు గ్రామానికి చెందిన ఎర్రంశెట్టి అప్పారావుకు సంధ్యారాణితో 13ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు.

08/23/2019 - 02:22

విజయవాడ (క్రైం), ఆగస్టు 22: నగరంలోని పలు దుకాణాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా వి క్రయాలు జరుపుతున్న నలుగురు వ్య క్తులను అదుపులోకి తీసుకుని సుమా రు రూ.9.97లక్షలు విలువ చేసే సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.

08/23/2019 - 00:52

విజయవాడ/రాజమహేంద్రవరం, ఆగస్టు 22: పోలవరం ప్రాజెక్టులో భాగమైన జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి రివర్స్ టెండరింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఏపీ జెన్‌కో జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేస్తూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిలిపివేయాలని గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

Pages