S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/22/2019 - 23:55

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరాన్ని నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీకి పంపుతూ ప్రత్యేక కోర్టు గురువారం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ అవినీతి కేసులో చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి పంపడం ఎంతైనా సమర్ధనీయమని ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహర్ తెలిపారు.

08/22/2019 - 23:23

ముంబయి, ఆగస్టు 22: ఓ మనీలాండలింగ్ కేసులో ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్‌థాకరేను ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. విచారణ నిమిత్తం దక్షిణ ముంబయిలోని ఈడీ కార్యాలయానికి రాజ్‌థాకరే తన కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చారు.

08/22/2019 - 23:18

న్యూఢిల్లీ, ఆగస్టు 22: రామాలయాన్ని కూల్చివేసే అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో బాబ్రీ మసీదు కట్టారని, అనాదిగా హిందువులు ఈ ప్రాంతంలో పూజలు చేస్తూనే వస్తున్నారని ఓ హిందూ సంస్థ గురువారం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో పూజలు చేసే హక్కు తమకు కల్పించాలని కోర్టును కోరింది. 1950లో ప్రార్థనా హక్కుల కోసం దిగువ కోర్టులో కేసు వేసిన రామ భక్తుడు గోపాల్ సింగ్ విశారద్ 1986లో మరణించాడు.

08/22/2019 - 07:13

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఎన్‌డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ తదితరులు 2007-09 మధ్య కాలంలో పెట్టుబడుల విషయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘించారని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. అయితే, సీబీఐ అభియోగాలను ఎన్‌డీటీవీ తోసిపుచ్చింది.

08/22/2019 - 02:17

పెనమలూరు, ఆగస్టు 21: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాడిగడపకు చెందిన షేక్ సర్దార్ బాషా(29) ఎలక్రీటిషయన్‌గా పనిచేస్తున్నాడు. పని మీద కంకిపాడు వెళ్లి వస్తున్నాడు. గంగూరు చైతన్య కాలేజ్ దగ్గరకు వచ్చేసరికి ముందు వైపు వెళుతున్న కారుకు హ్యాండిల్ తగలటంతో బైక్ పల్టీలు కొట్టింది.

08/22/2019 - 01:42

మేడ్చల్, ఆగస్టు 21: ఫిట్స్‌తో నీటిలో పడి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్‌పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ రైల్వేసేష్టన్ సమీపంలో నివాసం ఉండే ప్రభాకర్(25) బుధవారం ఉదయం తన స్నేహితుడు బాలుతో కలిసి మేడ్చల్ పెద్ద చెరువు వద్దకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు ప్రభాకర్‌కు ఫిట్స్ రావడంతో తల భాగం చెరువు నీటిలో పడి మునగడంతో మృతిచెందాడు.

08/22/2019 - 01:37

నేరేడ్‌మెట్, ఆగస్టు 21: విజిలెన్స్ అధికారులమంటూ చెప్పి ఆయిల్ ట్యాంకర్ యజమానుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను భువనగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం నేరేడ్‌మెట్ రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు. ఆనంతపూర్ గుంతకల్‌కు చెందిన షేక్ ఫజల్ రహమాన్(42) ట్యాంకర్ డ్రైవర్.

08/22/2019 - 01:35

కొత్తూరు రూరల్, ఆగస్టు 21: క్రిమిసంహారక మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తూరు మండలం కుమ్మరిగూడ గ్రామ శివారులో చోటు చేసుకుంది. కొత్తూరు సీఐ చంద్రబాబు కథనం ప్రకారం వివరాలు నందిగామ మండలం తాళ్లగూడ గ్రామానికి చెందిన శివకుమార్ (30) మంగళవారం మధ్యాహ్నం కొత్తూరు మండలం కుమ్మరిగూడ శివారులోని ఒక వెంచర్‌లో క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలిపారు.

08/22/2019 - 01:35

నార్సింగి, ఆగస్టు 21: మద్యం మత్తులో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. గండిపేటలోని గండిమైసమ్మ దేవాలయంలో మంచిరేవుల, కొల్లూరు ప్రాంతాలకు చెందిన యువకులు దావత్ చేసుకున్నారు. మద్యం మత్తులో ఇరువర్గాలకు చెందిన యువకులు దాడులు చేసుకోవడంతో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

08/22/2019 - 01:04

హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై బుధవారం నాడు హైకోర్టులో విచారణ కొనసాగిం ది. ఎన్నికలకు సంబంధించి అన్నీ సక్రమంగా చేస్తామని పేర్కొంటూ ప్రభు త్వం సమగ్ర కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ప్రభుత్వం దృష్టికి వచ్చిన అభ్యంతరాలను కూడా సరిచేస్తామని పేర్కొంది. దాంతో కౌంటర్‌పై ఈ నెల 28న వాదనలు కొనసాగించనున్నట్టు పేర్కొంటూ
హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
చెన్నమనేని కేసు విచారణ

Pages