S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/04/2019 - 01:56

మేడ్చల్, జూలై 3: పరీక్షల్లో ఫేయల్ అందని ఓంటి పై కిరోసిన్ పోసుకుని విద్యార్థిని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. పట్టణంలోని కిందిబస్తీలో నివాసం ఉండే గంగాధర్ - అంజవ్వ దంపతుల కూతురు పల్లవి(17) ఇంటర్‌మీడియట్ రెండవ సంవత్సరం చదువుతుంది. మొదటి సంవత్సరంలో రెండు సబ్జెక్టులు ఫెయల్ అయింది. అప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి గురవుతుంది.

07/04/2019 - 01:56

పరిగి, జూలై 3: మైనర్ బాలికకు మాయమాటలు మాయమాటలు చెప్పి గుడిలో పెళ్లి చేసుకున్న ఆటోడ్రైవర్. బుధవారం పరిగి పోలీస్‌లు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ చంద్రకాంత్ కథనం ప్రకారం.. పరిగి మండలం సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికను మలెమూని గూడేం గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనె ఆటోడ్రైవర్ యాదగిరి గుట్టలో పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

07/04/2019 - 01:54

హైదరాబాద్, జూలై 3: ప్రాణం తీసిన ఫోన్ ఘటన బేగంపేట్ రైల్వే పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. హైదరాబాద్ నాంపల్లి రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సితాఫల్‌మండి ప్రాంతానికి చెందిన 22 సంవత్సరాల మాధవి ఆశ్విని రోజు మాదిరిగానే బుధవారం ఉదయం సీతాఫల్ మండిలో ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. నేచర్‌క్యూర్ ఆసుపత్రి రైల్వేస్టేషన్‌లో ఆమె దిగాల్సి ఉంది. ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్న మాధవి..

07/04/2019 - 01:44

హైదరాబాద్, జూలై 3: ఉస్మానియా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మే 21 చికిత్స పొందుతూ 42 సంవత్సరాల వయసున్న విచారణ ఖైదీ అగుళ్ల లక్ష్మణ్ (తండ్రి భిక్షపతి) మృతి చెందాడు. మరణించిన సంఘటనపై ఈనెల 8వ తేదీన ఉదయం 11.00 గంటల నుంచి 5.00 గంటల వరకు న్యాయ విచారణ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కే.సూర్యలత బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

07/04/2019 - 00:46

హైదరాబాద్: అమెరికాకు చెక్కేద్దామని ప్రయత్నించిన సినీనటుడు శొంఠినేని శివాజీని నాటకీయంగా బుధవారం సైబరాబాద్ సైబర్ క్రైంమ్ పోలీసులకు చిక్కాడు. అయతే శివాజీని అరెస్టు చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. ‘గరుడ పురాణం’ శివాజీ విదేశాలకు పారిపోకుండా సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

07/03/2019 - 23:50

నిజామాబాద్, జూలై 3: జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్, హౌసింగ్‌బోర్డు ప్రాంతాల్లోని మూడు బంగారు దుకాణాల్లో ఆగంతకులు భారీ చోరీలకు పాల్పడిన సంఘటన జరిగి 48 గంటలు గడవకముందే దుండగులు మరోమారు తెగబడ్డారు. జిల్లా కేంద్రంలోని న్యాల్‌కల్ రోడ్డులో ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలిని హతమార్చి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను లూటీ చేసుకుని పారిపోయారు.

07/03/2019 - 23:44

దేవరకొండ, జూలై 3: టీఆర్‌ఎస్‌కు చెందిన ఉపసర్పంచ్ ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. నల్లగొండ జిల్లా దేవరకొండ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని చందంపేట మండలం గుంటిపల్లి గ్రామానికి చెందిన లాల్యనాయక్ (53)ను మంగళవారం రాత్రి అతని ప్రత్యర్థులు దారుణంగా హత్యచేశారు.

07/03/2019 - 04:14

గరుగుబిల్లి, జూలై 2: కాశీ తీర్థయాత్ర ముగించుకుని తిరుగుప్రయాణంలో వస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు మంగళవారం వేకువజామున విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామ సమీపంలోని ఎడమ కాలువలో బోల్తాపడింది. ఈ సంఘటనలో 22 మందికి గాయాలయ్యాయి.

07/03/2019 - 04:13

నర్సీపట్నం, జూలై 2: రాష్ట్ర హోం శాఖా మంత్రి సుచరితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాట్సాప్‌లో పోస్టు చేసిన విశాఖ జిల్లా రోలుగుంట మండలం ఎంకేపట్నం గ్రామానికి చెందిన రామును గుంటూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేసిన విషయం మంగళవారం వెలుగు చూసింది. హో మంత్రి సుచరితపై అభ్యంతరకరంగా పెట్టిన పోస్టులను రామ్‌మహారాజ్ పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్ నిర్వహిస్త్నుట్లు పోలీసులు నిర్ధారించారు.

07/03/2019 - 02:27

ప్రొద్దుటూరు, జూలై 2: ఆదాయానికి మించిన ఆస్తులు కూడిబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న కడప జిల్లా మైలవరం పంచాయతిరాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పల్లా సుబ్బయ్యని ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించి భారీ మొత్తంలో బంగారం, వెండి, నగలు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

Pages