-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ఖమ్మం, జూలై 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీశాఖ అధికారులపై గ్రామస్థులు అర్ధరాత్రి దాడి చేశారు. దీంతో అటవీ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అటవీ అధికారులు ఏ ప్రాంతానికి వెళ్ళినా ముందుగానే పోలీసులకు సమాచారం అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సోమవారం అర్ధరాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం, గుండాలపాడు పంచాయతీ పరిధిలో అటవీ అధికారులపై పోడుసాగుదారులు దాడిచేశారు.
జీడిమెట్ల, జూలై 2: డీసీఎం వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సికింద్రాబాద్, బొల్లారం బజార్లో నివాసముండే చట్ల అశోక్ (58) సెక్యురిటీ గార్డ్గా పనిచేస్తుంటాడు. మంగళవారం కొంపల్లి ఎన్హెచ్ 44లో దర్గా వద్ద అశోక్ రోడ్డు దాటుతున్నాడు. ఏపీ 29యూ 2877 నంబరు గల డీసీఎం వ్యాన్ అతివేగంగా దూసుకువచ్చి ఢీకొట్టింది.
ఉప్పల్, జూలై 2: చెంగిచర్ల ఇందిరానగర్కు చెందిన వీరమణి ఆత్మహత్య కేసులో అత్త నర్సమ్మ, ఆడపడుచులు బాలమణి, జానకిలను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి మంగళవారం కోర్టుకు రిమాండ్ చేశారు. అత్తింటి వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు.
నాచారం, జూలై 2: నాచారం పారిశ్రామికవాడలోని జీవీకే బయో పరిశ్రమలో మంగళవారం సాయంత్రం రియాక్టర్ పేలి ఐదుగురు తీవ్రంగా గాయపడగా, ఒకరు మృతి చెందినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే - నాచారం పారిశ్రామికవాడలోని జీవీకె పరిశ్రమలో మంగళవారం సాయంత్రం రియాక్టర్ పేలడంతో భారీ శబ్దంతో చుట్టు పక్కలవారు భయాందోళనకు గురయ్యారు.
జీడిమెట్ల, జూలై 2: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును బాచుపల్లి పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. బాచుపల్లి గ్రామం, కౌసల్య కాలనీలోని గుల్మొహర్ అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్నటువంటి టీఅండ్ పాన్షాప్లో అదేకాలనీకి చెందిన భూపతిరాజు కిషోర్, శ్రీనివాస్ రావు.. వరల్డ్ కప్ మ్యాచ్ల ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.
మెహిదీపట్నం, జూలై 2: టోలీచౌకీ ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండగా డ్రైవర్పై క్రేన్ పడి సంఘటన స్థలంలోనే మృతిచెందిన ఘటన గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గత కొంత కాలంగా టోలిచౌకీలో ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్నాయి. పంజాబ్కు చెందిన గుర్ప్రీత్సింగ్ (45) ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్న క్రేన్కు డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకటించే నగదు బదిలీ పథకాలు రాజ్యాంగ విరుద్ధం, అవినీతితో కూడిన ఎన్నికల వ్యూహాలుగా ప్రకటించాలని కోరుతూ జనసేన నాయకుడు పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
విజయవాడ (క్రైం): తనకు భద్రత తగ్గించారంటూ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వేసిన పిటిషన్పై హైకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. రాజకీయ కారణాలతో చంద్రబాబుకు భద్రత తగ్గించారని ఆయన తరఫు న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు.
న్యూఢిల్లీ, జూలై 2: పంజాబ్ నేషనల్ బ్యాంక్ను మోసగించిన కేసులో నిందితుడు నీరవ్ మోదీ సోదరి, బావముది సింగపూర్ బ్యాంకుల్లో దాచిన రూ. 44.41 కోట్ల డిపాజిట్లను స్తంభింప జేయాల్సిందిగా అక్కడి హైకోర్టు మంగళవారం సింగపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వేల్పూర్, జూలై 2: వేల్పూర్ మండలం పడిగెలలో మంగళవారం రెండేళ్ల చిన్నారిని సజీవ దహనం చేసి.. తాను నిప్పంటించుకుని ఓ వివాహిత ఆత్మహత్యయత్నం చేసింది. ఈ ఘటనలో చిన్నారి కూతురు లిల్లీ మరణించగా తల్లి వౌనిక పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్థులు తెలిపిన ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వౌనిక తల్లిదండ్రులు నారాయణ, లక్ష్మినాలుగేళ్ల క్రితం నిజాంసాగర్ మండలం నుంచి బతుకుతెరువు నిమిత్తం పడిగెల గ్రామానికి వచ్చారు.