S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/02/2019 - 06:19

నిజామాబాద్, జూలై 1: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగల ముఠా స్వైర విహారం చేసింది. బంగారు ఆభరణాల దుకాణాలను లక్ష్యంగా చేసుకుని ఎంతో చాకచక్యంగా చోరీలకు పాల్పడి భారీ సొత్తును అపహరించుకుని పారిపోయారు. సుమారు 50లక్షల రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును తస్కరించినట్టు భావిస్తున్నారు.

07/02/2019 - 04:04

పలమనేరు , జూలై 1: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఉసర పెంటగ్రామంలో ఇటీవల చోటు చేసుకొన్న పరువు హత్య కేసులో ఆరు గురిని అరెస్టు చేసినట్లు పలమనేరు డీ ఎస్పీ యుగంధర్ తెలిపారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఉసర పెంట గ్రామంలో కులాంతర వివాహం చేసుకుందని అగ్రహించిన హేమావతి గత శుక్రవారం హత్యకు గురైన సంగతి తెలిసిందే.

07/02/2019 - 04:01

అమరావతి, జూలై 1: ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనకు భద్రత కుదించిందని దీనిపై పునస్సమీక్షించేందుకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం, డీజీపీ, గుంటూరు పోలీసులను పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. బాబు పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

07/02/2019 - 02:46

గన్నవరం, జూలై 1: చైన్నై కోల్‌కత్తా జాతీయ రహదారిపై చినవుటుపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్దార్థ ఆసుపత్రి ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బాపులపాడు మండలం వేలేరుకు చెందిన గోళ్ళ ఏడుకొండలు, అతని భార్య వెంకటేశ్వరమ్మ విజయవాడ నుండి వేలేరు బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొంది.

07/02/2019 - 02:32

వికారాబాద్, జూలై 1: ట్రెక్కింగ్ బైక్ అదుపు తప్పి ఓ టూరిస్టు మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ దాసు తెలిపిన వివరాల ప్రకారం యూఎస్‌ఏలో ఉంటున్న సాఫ్టవేర్ ఉద్యోగి అరవింద్(45) కొన్ని రోజుల క్రితమే స్వదేశానికి వచ్చారు. తోటి ఉద్యోగులు, స్నేహితులతోకలిసి అనంతగిరి అటవీ ప్రాంతానికి వచ్చి నాలుగు చక్రాల బైక్‌పై అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేశాడు.

07/02/2019 - 02:32

మేడ్చల్, జూలై 1: విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ మృతిచెందిన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర నాందేడ్ జిల్లా బిలాల్ తాలుకా పప్పల్ గ్రామానికి చెందిన రహీమ్ పఠాన్(40) రెండు సంవత్సరాల క్రితం జీవనోపాధి నిమిత్తం మేడ్చల్ ప్రాంతానికి వచ్చి డబిల్‌పూర్ గ్రామంలో నివాసం ఉంటూ అత్వెల్లి కొండల్ రెడ్డి వద్ద టిప్పర్ లారీపై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

07/02/2019 - 02:31

బాలాపూర్, జూలై 1: రంగారెడ్డి జిల్లా కోర్టులో ఓ న్యాయమూర్తి వద్ద పనిచేసే యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జనగాం, కుందవరం గ్రామానికి చెందిన బండి శంకర్ (26) తన అన్నయ్య రాజుతో కలిసి మీర్‌పేట్ సీర్లహిల్స్‌లో నివాసముంటునాడు.

07/02/2019 - 02:30

ఉప్పల్, జూలై 1: అత్తింటి వేధింపులకు ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం- చెంగిచర్ల ఇందిరానగర్‌లో నివసిస్తున్న ఏ.రాజు భార్య వీరమణి (28) గృహిణి. తొమ్మిదేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి ముగ్గురు పిల్లలు. నిత్యం అత్త వేధింపులతో ఇటీవలనే వేరు కాపురం పెట్టారు.

07/02/2019 - 02:30

ఉప్పల్, జూలై 1: అనుమానస్పదస్థితిలో బాలిక ఆత్మహత్యా చేసుకున్నా సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కధనం ప్రకారం.. రామంతాపూర్ వెంకట్‌రెడ్డినగర్‌కు చెందిన వెంకటేష్ కూతురు రేఖా, సోమావారం ఉదయం ఇంట్లో ఎవరులేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

07/02/2019 - 02:29

కొడంగల్, జూలై 1: కొడంగల్ పట్టణంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ శేఖర్ గౌడ్ కథనం ప్రకారం.. పట్టణంలోని విద్యుత్ కార్యాలయ సమీపంలో వ్యక్తి అనుమానస్పదస్థితిలో మృతిచెందడం గమనించిన కొంత మంది పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. సంఘటన స్థలాన్ని పరిశీలించగా మృతినికి సంబంధించిన వివరాలు ఏమి తెలియరాలేదు.

Pages