-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ఖైరతాబాద్, జూలై 1: కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన ఓ మహిళ క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడగా, తన ఇద్దరు చిన్నారులు తల్లడిల్లిపోయారు. అమ్మ అంటూ ఏడు నెలల చిన్నారి విలపించిన తీరు స్థానికుల కంట కన్నీరు పెట్టించింది. ఈ హృదయ విదారక సంఘటన పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎస్ మక్తా హరిగేట్ సమీపంలో నివాసం ఉండే రవికుమార్ కొరియర్ సంస్థలో పనిచేస్తుంటాడు.
ఉప్పల్, జూలై 1: బోడుప్పల్లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. స్నేహితులు ఇంటి నుంచి తీసికెళ్లి హత్య చేసిన సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బోడుప్పల్ పాత బస్తీలో నివసిస్తున్న ఉప్పరి జంగయ్య కుమారుడు సాయి అలియాస్ కట్టెల సాయి (25) జీహెచ్ఎంసీలో హెల్పర్గా పని చేస్తున్నాడు. గత నెల 30న ఆదివారం ఇంట్లో ఉన్న సాయిని దయావంశీ అనే యువకుడు వచ్చి బైక్పై తీసికెళ్లాడు.
న్యూఢిల్లీ: తెలంగాణలోని భూపాలపల్లి కాకతీయ గని-2లో ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరిట నివాసాలకు 500 మీటర్ల లోపు మైనింగ్, బ్లాస్టింగ్ జరపకుడదని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్టీటీ) ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్జీటీ ఆదేశాలు సవాల్ చేస్తూ సింగరేణి కాలరీస్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. గతంలో ఎన్జీటీ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.
జమ్మూ, జూలై 1: పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఒక మినీ బస్సు లోయలో పడిన సంఘటనలో 35 మంది మరణించారు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జమ్మూ-కాశ్మీర్లోని కిస్త్వార్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగింది.
హైదరాబాద్, జూలై 1: ఇంజనీరింగ్ ఫీజుల నిర్ణయాధికారం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఏఎఫ్ఆర్సీ (అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ)కే ఉంటుందని సుప్రీంకోర్టు సోమవారం నాడు స్పష్టం చేసింది.
కొత్తగూడెం, జూలై 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతువాగు సమీపంలో ఫారెస్ట్ అధికారుల విధులకు ఆటంకం కల్పించారనే ఫిర్యాదు మేరకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేశారు. చాతకొండ డెప్యూటీ రేంజ్ అధికారి ఎంఆర్పీ రావు ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో పాటు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ నరేష్ తెలిపారు.
గుర్గావ్, జూలై 1: పీహెచ్డీ డిగ్రీ సాధించి, ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 55 ఏళ్ల వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం..
న్యూఢిల్లీ, జూలై 1: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే), జిల్జిత్ను రెండు లోక్సభ స్థానాలుగా కేంద్ర గుర్తించేందుకు వీలుగా ఆదేశాలు ఇవ్వాలని రీసెర్చ్ అండ్ అనలైసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ) మాజీ అధికారి రామ్ కుమార్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారంనాడు తిరస్కరించింది. అంతేకాకుండా సదరు ఇంటెలిజెన్స్ అధికారి రామ్ కుమార్ యాదవ్కు 50 వేల అపరాధ రుసుం విధించింది.
ఆసిఫాబాద్, జూన్ 30: కుమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలపై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఐదవ తరగతి చదువుకుంటున్న ఆ ఇద్దరు బాలికలు మధ్యాహ్నం సమయంలో ఒకేచోట ఆడుకుంటున్నారు. కుటుంబ సభ్యులు లేకపోవడంతో అక్కడే ఉంటున్న నైతం జ్ఞానేశ్వర్ అనే కూలీ ఇద్దరు మైనర్లపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
పూణె, జూన్ 30: కొంధ్వా ప్రాంతంలో 22 అడుగుల గోడ కూలి 15మంది దుర్మరణం చెందిన ఘటనలో ఇద్దరు బిల్డర్లను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. అల్కాన్ లాండ్మార్క్స్కు చెందిన భాగస్వాములైన ఇద్దరు బిల్డర్లు విపుల్ అగర్వాల్, వివేక్ అగర్వాల్లను పోలీసులు అరెస్టు చేసి ఆదివారం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చగా మంగళవారం వరకు రిమాండ్కు తరలించారు.