S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/27/2019 - 01:29

ఘట్‌కేసర్, జూన్ 26: యజమాని దృష్టి మళ్లించిన గుర్తు తెలియని మహిళా దొంగలు విలువైన చీరలను దొంగిలించుకు పోయిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి వెంకటాద్రి టౌన్‌షిప్‌లో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

06/27/2019 - 01:29

నేరేడ్‌మెంట్, జూన్ 26: ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని రాచకొండ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. భువనగిరి జిల్లా యాదిగిరిగుట్ట మండలం మల్లాపూర్‌కు చెందిన చంద్రశేఖర్ (38) వృత్తిరీత్యా డ్రైవర్. ఉద్యోగం చేస్తు ఇళ్లల్లో దొంగతనలకు పాలుపడుతున్నట్లు తెలిపారు.

06/27/2019 - 01:28

ఖైరతాబాద్, జూన్ 26: పాత కక్షలతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలో చోటుచేసుకున్న సంఘటన పోలీసులను ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేంది. నడిరోడ్డుపై వ్యక్తిదారుణ హత్యకు గురికావడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాగుట్ట బడే మజీద్ ప్రాంతంలో నివాసం ఉండే అన్వర్(32) ఆటోడ్రైవర్.

06/27/2019 - 03:51

విజయవాడ (క్రైం): ఉండవల్లి కరకట్ట వద్ద మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాసం సమీపంలోని ప్రజావేదికను కూల్చివేయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది.

06/26/2019 - 22:34

బరేలీ/డెహ్రాడూన్, జూన్ 26: ఉత్తరాఖండ్ విద్యాశాఖ మంత్రి అరవింద్ పాండే కుమారుడు అంకుర్ బరేలీ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని ఫరీద్‌పూర్ ప్రాంతంలో అంకుర్ ప్రయాణిస్తున్న కారు ఓ లారీని ఢీకొంది.

06/26/2019 - 04:44

రామన్నపేట, జూన్ 25: ఈతకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన నర్రాముల నర్సింహ ఇద్దరు కుమారులు నర్రాముల శివకృష్ణ (22), నర్రాముల రాము (15) గ్రామశివారులోని వ్యవసాయబావి వద్దకు ఈతకు వెళ్లారు.

06/26/2019 - 04:33

బిక్కవోలు, జూన్ 25: తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం అదుపుతప్పిన ఆర్టీసీ అద్దె బస్సు బీభత్సం సృష్టించింది. ముందువెళుతున్న ఒక కారును ఢీకొని, ఆపై ఒక బైక్‌పైకి దూసుకువెళ్లి, మరో స్కూటర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు మృతిచెందగా, అదే బైక్‌పైవున్న బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కారులోని వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, స్కూటర్‌పై ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

06/26/2019 - 04:31

విశాఖపట్నం, జూన్ 25: ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలోకి వచ్చే సింగపూర్ రోడ్డు, కేట్‌గుడ రైల్వే సెక్షన్ల మధ్య రాయగడకు సమీపాన మంగళవారం సాయంత్రం టవర్ కార్‌ను హౌరా-జగదల్‌పూర్ (18005)ల మధ్య నడిచే శ్యామలేశ్వరి ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఈ సంఘటనలో ఎక్స్‌ప్రెస్ ఇంజన్ ధ్వంసమైంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా రైల్వేకు సంబంధించిన ముగ్గురు ఉద్యోగులు మృతి చెందారు.

06/26/2019 - 04:28

శాంతీపురం, జూన్ 25: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సామాజిక మాద్యమంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని మంగళవారం చిత్తూరు జిల్లా రాళ్లబూదుగూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

06/26/2019 - 04:28

బొబ్బిలి, జూన్ 25: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామంలో అంగన్‌వాడీ బాలికపై ఓ విద్యార్థి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు మంగళవారం ఆలస్యంగా ఫిర్యాదు అందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 17న పెంట గ్రామంలో అంగన్‌వాడీ బాలికపై విద్యార్థి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాలిక తండ్రి ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పోలీసులు మంగళవారం రంగ ప్రవేశం చేసి విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.

Pages