S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/26/2019 - 01:27

బార్మెర్: జోధ్‌పూర్‌లోని బార్మెర్‌లో ఆదివారం సాయంత్రం పెళ్లి పందిరి కూలిన ఘటనలో మరణించిన 15 మందిలో 10 మంది విద్యుదాఘాతంతోనే మరణించారని బలోత్రాలోని ప్రభుత్వ నహతా ఆసుపత్రి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బలరామ్ నహ్‌తా తెలిపారు. సంఘటన స్థలంలో 14 మంది మరణించగా, తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తికి జోధ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించామని ఆయన పేర్కొన్నారు.

06/25/2019 - 04:44

దేవరకొండ, జూన్ 24: నల్లగండ జిల్లా దేవరకొండ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

06/25/2019 - 04:42

భువనగిరి, జూన్ 24: ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్ నరుూమొద్దీన్ భూకబ్జాలపై విచారణ కొనసాగిస్తున్న రాచకొండ పోలీసులు పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు నరుూం భార్యతో పాటుగా ఆయన అనుచరులు నలుగురిపై పీడీ యాక్టు నమోదుచేసినట్టు సోమవారం రాచకొండ కమిషనరేట్‌నుండి ప్రకటనవిడుదల చేసింది.

06/25/2019 - 02:07

నాగాయలంక, జూన్ 24: మండలంలోని ఏటిమొగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు, అతని భార్య బ్యాంకు ఖాతాలు నుంచి గుర్తు తెలియని ఓ అగంతకుడు పెద్ద మొత్తంలో నగదును కైంకర్యం చేసినట్లు ఆలస్యంగా తెలిసింది.

06/25/2019 - 02:07

జగ్గయ్యపేట, జూన్ 24: పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద తన అనుచరులతో అనుచితంగా ప్రవర్తించిన మున్సిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్‌పై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో రాత్రి కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రౌడీ షీటు నమోదు అయిన వారు ఫోటోలు సేకరించే పనిలో భాగంగా పట్టణ ఎస్‌ఐ ధర్మరాజు చైర్మన్ రాజగోపాల్‌కు ఫోన్ చేసి ఫోటోలు కావాలని అడిగారు.

06/25/2019 - 01:54

కొడంగల్, జూన్ 24: కరెంటు షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని పర్సాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ ఐ శేఖర్‌గౌడ్ కథనం ప్రకారం.. కావలి శంకరమ్మ(35) సోమవారం ఉదయం ఇంటిని శుభ్రం చేస్తుండగా ఇంటికి ఉన్న మెట్లకు ఇనుపరాడ్లు ఉండటంతో వాటికి కరెంటు అర్తింగ్ రావడంతో కరెంటు తగిలి ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది.

06/25/2019 - 01:53

ఖైరతాబాద్, జూన్ 24: గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతిచెందిన సంఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. ఆదర్శ్‌నగర్, నౌబత్‌పహాడ్‌కు చెందిన ప్రవీణ్ కుమార్, మీనా కుమారి(40) దంపతులు ఆదివారం రాత్రి తమ హోండా యాక్టీవాపై ఆనంద్‌నగర్ కాలనీలోని వారి బంధువుల ఇంటికి వచ్చారు.

06/25/2019 - 01:53

హైదరాబాద్, జూన్ 24: యువ కథానాయకుడు రామ్‌కు చార్మినార్ పోలీసులు జరిమానా విధించారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసినందుకు రామ్ నుంచి రూ.200 జరిమానా కింద చార్మినార్ పోలీసులు వసులు చేశారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్‌లో రామ్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో జరుగుతోంది.

06/25/2019 - 01:52

ఘట్‌కేసర్, జూన్ 24: ఇంటి తాళాలు పగులగొట్టి బిరువాలోని బంగారు, వెండి నగలను అపహరించుకు పోయిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి వెంకటాద్రి టౌన్‌షిప్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

06/25/2019 - 01:14

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణలో సచివాలయం కూల్చివేత వ్యవహారం హైకోర్టులో మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఎర్రగడ్డలో సచివాలయం నిర్మించాలని నిర్ణయించినపుడు 2016లో హైకోర్టులో జీవన్‌రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేవలం వాస్తు కోసం సచివాలయం కూల్చివేయడం సమంజసం కాదని అన్నారు.

Pages