-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
న్యూఢిల్లీ, జూన్ 24: బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మెదడువాపువ్యాధి విజృంభణపై సుప్రీం కోర్టు స్పందించింది. బిహార్లోని ముజాఫర్పూర్లో ఎన్సెఫాలిటీస్ సిండ్రోం(ఏఈఎస్)తో వంద మంది పిల్లలు మృతి చెందారు. యూపీలోనూ వ్యాధి తీవ్రత అధికంగానే ఉంది. వ్యాధి నివారణపై తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్రం, సంబంధిత రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మద్నూర్, జూన్ 23: విద్యుత్ చౌర్యాన్ని గుర్తించేందుకోసం తనిఖీలకు వచ్చిన ట్రాన్స్కో విజిలెన్స్ అధికారులపై, ఓ సర్పంచ్ కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా దాడిచేయడంతో, ఒకరికి తీవ్రగాయాలు కాగా, ఐదుగురు స్వల్ప గాయాలయ్యాయని, ట్రాన్స్కో ఏడీఏ నాందేవ్ ఆదివారం తెలిపారు. ట్రాన్స్కో అధికారులు తెలిపిన కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కోయిలకొండ, జూన్ 23: ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటామంటే పెద్దలు వద్దంటున్నారని ఇంటి నుంచి వెళ్ల్లిపోయన ఇద్దరు ప్రేమికులు మూడు నెలల తర్వాత గుట్టల ప్రాంతంలో ఉరి వేసుకొని చెట్టుకు వేలాడుతూ ఆదివారం అస్థి పంజరాలుగా కన్పించారు. మహబూబ్నగర్ జిల్లాలోని కోయలకొండ మండలంలోని రాంపూర్ గ్రామంలో ఈ సంఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
తాడ్వాయి, జూన్ 23: నిషేధిత మావోయిస్టు కొరియర్లు నలుగురిని అరెస్టు చేసినట్టు స్థానిక ఎస్సై రవీందర్ తెలిపారు. ఆదివారం తమకు అందిన సమాచారం మేరకు కాటాపూర్ క్రాస్ రోడ్ వద్ద నలుగురు అనుమానితులు కనిపించడంతో పోలీసు సిబ్బందితో వారిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
ఒంగోలు: ఒంగోలులో ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సంఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్ తెలిపారు. ఆదివారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్పీ ఈ కేసు వివరాలను వెల్లడించారు. బాలికపై అత్యాచారం చేసిన కేసులో ముగ్గురు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తెలిపారు.
ఎమ్మిగనూరు రూరల్, జూన్ 23 : కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ఖాతాదారులను మోసం చేసి బోర్డు తిప్పేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎమ్మిగనూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘జాన్ ఫైనాన్స్ కంపెనీ’ యాజమాన్యం దాదాపు రూ. 14 లక్షల ఖాతాదారుల సొమ్ముతో ఉడాయించినట్లు తెలుస్తోంది. జాన్ ఫైనాన్స్ కంపెనీ 2018 డిసెంబర్ 15వ తేదీ ఎమ్మిగనూరు పట్టణంలో ప్రారంభమైంది.
మానవపాడు: ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన సంఘటన ఆదివారం రాజోలి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివారాలిలా ఉన్నాయి. ఆదివారం మద్యాహ్నం రాజోలీ మండల కేంద్రంలోని శ్రీరామ్నగర్కు కాలనికి చెందిన వెంకటప్ప, బజారి, ఎల్లప్పల కుమారులు చరణ్ (7) రెండవ తరగతి, శివయ్య(8) రెండవ తరగతి, యుగందర్(5) యూకేజి చదువుతున్నారు.
శామీర్పేట, జూన్ 23: ఏడేళ్ల బాలికపై వద్ధుడు అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. జవహర్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే బాలికను వెంకటయ్య అనే వృద్ధుడు భవనం పైఅంతస్తుకు తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడుతుండగా మరొకరి గమనించి అరవడంతో పారిపోయాడు. వెంకటయ్య స్థానికులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు.
మేడ్చల్, జూన్ 23: ఆర్థిక ఇబ్బందులతో తాళలేక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఆంధ్ర రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన మురళీకృష్ణ(32) ఐదు రోజుల క్రితం ఉద్యోగం కోసం మేడ్చల్లోని తన స్నేహితుడు మహేశ్ వద్దకు విచ్చేశాడు. మహేశ్ రూమ్లోనే ఉంటున్నాడు.
మేడ్చల్, జూన్ 23: వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గౌడవెళ్లి గ్రామానికి చెందిన జీ. పాండు(62) కుటుంబ కారణాలతో ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. పాండు భార్య, కుమారుడు, కూతురు నగరంలోనని మోండా మార్కెట్ ప్రాంతం వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో పాండు అప్పుడప్పుడు మోండా మార్కెట్లోని తన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వచ్చేవాడు.