-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
రోహ్తక్ (హర్యానా), జూన్ 22: డేరా సచ్చా సౌదా (డీఎస్ఎస్) చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ 42 రోజుల పాటు పెరోల్ కావాలని కోరాడు. హర్యానాలోని సీర్సాలో గల తన పంట చేలలో వ్యవసాయం చేసుకోవడానికి పెరోల్ కావాలని అతను కోరినట్టు అధికారులు శనివారం తెలిపారు. రెండు అత్యాచార కేసులతో పాటు ఒక జర్నలిస్టు హత్య కేసులో దోషిగా తేలిన 51 ఏళ్ల సింగ్ ప్రస్తుతం రోహ్తక్లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
కీసర, జూన్ 22: గత 15 సంవత్సరాలుగా మానసిక, అంగవైకల్యంతో బాధపడుతున్న కుమారులను చూసి, తీవ్ర మనస్థాపం చెందిన తల్లి ఇద్దరు కుమారులకు నిద్ర మాత్రలు వేసి, తాను నిద్ర మాత్రలు మింగిన సంఘటన రాంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రాంపల్లి గ్రామం, లక్ష్మీనగర్లో నివాసముంటున్న నర్సింహా రెడ్డి, పద్మ దంపతులకు మతిస్థిమితం, అంగవైకల్యంతో బాధపడుతున్న తేజవర్ధన్, మనువర్ధన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఉప్పల్, జూన్ 22: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం సికింద్రాబాద్ బోలక్పూర్లో నివసిస్తున్న బస్వ మల్లిఖార్జున్ గౌడ్ (45) రెండు రోజుల క్రితం పీర్జాదిగూడ కృష్ణానగర్లో ఉంటున్న బిడ్డ ఇంటికి వచ్చాడు. దిగులుగా ఉన్న అతడిని ఏమైందని అల్లుడు అడగడటంతో అప్పులు అయ్యాయని, ఇచ్చిన వారు ఇంటికి వస్తున్నారని చెప్పారు.
ఉప్పల్, జూన్ 22: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో కూలీ మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పీర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్క్లేవ్ గుడిసెల్లో నివసిస్తున్న నల్డొ జిల్లా నిడమనూరు మండలం ఉట్నూరు గ్రామానికి చెందిన ఇస్త్రం వినయ్ (19) కూలీ.
జీడిమెట్ల, జూన్ 22: ప్రమాదవశాత్తు లారీ క్రింద పడ్డ వ్యక్తి మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఆంధప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా, వెంపల్లి మండలం, వెములవారి పల్లి గ్రామానికి చెందిన ఎటూరీ శ్రీనాధ్ రెడ్డి(31) సంవత్సరంన్నర క్రితం బాచుపల్లిలోని ఐజేఎం కాంక్రీట్ ప్రాడక్ట్ లిమిటెడ్ పరిశ్రమలో క్వాలిటీ టెక్నీషియన్గా విధులను నిర్వహిస్తున్నాడు.
జీడిమెట్ల, జూన్ 22: అనుమానితుడిని పట్టుకున్న పోలీసులకు చుక్కలు చూపించాడు నిందితుడు. వివరాలల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్ ఓ మిస్సింగ్ కేసులో భాగంగా బాచుపల్లి పోలీస్స్టేషన్కు వచ్చారు. మిస్సింగ్ కేసులో అనుమానితుడైన శ్రీ్భమ్శంకర్ అనే వ్యక్తిని విచారించారు.
బాలాపూర్, జూన్ 22: బంధువుల గృహప్రవేశానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని వాటర్ట్యాంకర్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం సిరిసిల్లకు చెందిన వెంకటేశ్వ రావు (75) సరూర్నగర్లోని తన కుమార్తె వద్దకు శుక్రవారం వచ్చాడని అన్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బాబాయ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొత్తగా పోలీసు అధికారులను నియమించింది. గత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంలో పని చేసిన అధికారులను బదిలీ చేసింది. మార్చి 15న పులివెందులలోని సొంత ఇంట్లో వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు.
న్యూఢిల్లీ, జూన్ 21: పుదుచ్చేరి ప్రభుత్వం ఆర్థిక భారం పడే తన కేబినెట్ నిర్ణయాలను అమలు చేయకుండా సంయమనం పాటించాలని గతంలో జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు జూలై పదో తేదీ వరకు పొడిగించింది. న్యాయమూర్తులు దీపక్ గుప్తా, సూర్యకాంత్లతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది.
చిలుకూరు, జూన్ 21: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని సీతారామపురం సమీపంలో గోదాముల వద్ద శుక్రవారం జరిగిన ఘెరో రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం..