-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
విజయవాడ, జూన్ 21: ట్రైకార్ రుణాల మంజూరులో అవినీతి జరిగినట్లుగా తన దృష్టికి వచ్చిందని, కార్ల కొనుగోలు రుణాల మంజూరులో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పుష్ప శ్రీవాణి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆమె తన చాంబర్లో గిరిజన సంక్షేమ శాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
న్యూఢిల్లీ, జూన్ 21: నీతి ఆయోగ్ మాజీ సీఈఓ సింధుశ్రీ ఖుల్లర్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి అనూప్ కే పుజారి, ప్రస్తుతం కొలువులో ఉన్న పలువురు ఉన్నతాధికారులు, రిటైర్డ్ ఉన్నతాధికారుల ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. వీరంతా పలు అవినీతి కేసుల్లో పాలుపంచుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
జకార్తా, జూన్ 21: ఇండోనేషియాలోని ఒక అగ్గిపెట్టెల తయారీ కర్మాగారంలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు చిన్నారులు సహా దాదాపు 30 మంది మరణించారు. సంబంధిత అధికార వర్గాల కథనం ప్రకారం..ఒక ఇంట్లో నిర్వహిస్తున్న ఈ అగ్గిపెట్టెల తయారీ కర్మాగారంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం సంభవించింది.
రేణిగుంట, జూన్ 21:: రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల అనుమానాస్పదంగా ఓ సూట్కేసు పడి ఉండటంతో అధికారులు పరుగులు పెట్టిన సంఘటన శుక్రవారం చోటు చేసుకునింది. వివరాల్లోకి వెడితే సాయంత్రం విమానాశ్రయం నుంచి వెలుపలికి వచ్చే మార్గంలో నల్లటి సూట్ కేసు వీల్ చైర్పై ఉండటాన్ని ప్రయాణికులు ఎవరూ పట్టించుకోలేదు. మరి కొందరు దాని పక్కనే నిలబడి అనుమానాస్పదంగా చూస్తుండటంతో అందిరిలో అనుమానాలు రేకెత్తాయి.
హైదరాబాద్, జూన్ 20: సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడికి నాంపల్లి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. భువనగిరికి చెందిన ఆకుతోట రామకృష్ణకు ఐదేళ్ల జైలుతో పాటు రెండు వేల రూపాయిల జరిమానా కూడా విధించింది. కేసీఆర్పై ఆకుతోట రామకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని మాదన్నపేట పోలీసులకు పాతబస్తీకి చెందిన ఇబ్రహీం ఫిర్యాదు చేశారు.
కుషాయిగూడ, జూన్ 20: ప్రమాదవశాత్తు చర్లపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. చర్లపల్లి అగ్నిమాపక అధికారి శేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేస్-1లో విశాల్ ప్లాస్టిక్ పారిశ్రామలో రాత్రి 9గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు అగ్నిమాపక వాహనాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి.
ఉప్పల్, జూన్ 20: వరంగల్లో చిన్నారిపై అత్యాచారం, హత్య సంఘటన మరువక ముందే హైదరాబాద్లో మరో పైశాచిక ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం జరిపాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతన్ని పట్టుకుని కట్టేసి దేహశుద్ధి చేస్తుండగా తప్పించుకుని పారిపోయాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
వికారాబాద్, జూన్ 20: ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ లక్ష్మయ్య కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన సందీప్ (27) పట్టణానికి చెందిన యువతిని కొంత కాలంగా ప్రేమించాడు. అమ్మారుూ ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమ విఫలమైందని భావించి సందీప్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గచ్చిబౌలి, జూన్ 20: వేగంగా వచ్చిన కారు.. మోటార్ సైకిల్ని ఢీకొట్టిన ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. మాదాపూర్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం ప్రాంతానికి చెందిన బోయిని ఆనంద్ కుమార్ (27) స్విగ్గీ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు.
షాద్నగర్ టౌన్, జూన్ 20: లారీ కిందపడి బీటెక్ విద్యార్థి మృతిచెందిన సంఘటన షాద్నగర్ పట్టణంలోని పరిగిరోడ్డులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షాద్నగర్ పట్టణంలోని ప్యారడైజ్ కాలనీలో నివాసముంటున్న సిమ్రాన్(20) అనే విద్యార్థిని, పరిగిరోడ్డు నుంచి సీఎస్కే వెంచర్కు బైకుపై వెళ్తుండగా అటుగా వచ్చిన లారీ ఢీకొనడంతో కిందపడిపోయింది.