S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/17/2020 - 06:10

తిమ్మాపూర్: దైవ దర్శనానికి సిద్ధిపేట జిల్లా కొమురవెల్లికి వెళ్తూ ప్రమాదవశాత్తు అల్గునూరు మానేరు బ్రిడ్జిపై నుండి కిందపడి ఒకరు మృతి చెందగా, బ్రిడ్జిపై నుంచి ప్రమాద సంఘటనను పరిశీలిస్తున్న కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిన సంఘటన అల్గునూరులో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

02/17/2020 - 06:08

కొత్తకోట: దైవ దర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో చోటు చేసుకుంది. సీఐ మల్లిఖార్జున్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర నుండి యంహెచ్ 13 టిఎస్ 2694 నెంబర్‌గల క్లూజర్ వాహనంలో తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తుండగా కొత్తకోట సమీపంలోకి రాగానే బైకును తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టింది.

02/17/2020 - 02:31

పాయకాపురం, ఫిబ్రవరి 16: అనుమానాస్పద స్థితిలో ఓ బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కండ్రిక ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహ్మద్ రజియా, తాజుద్దీన్‌ల కు ఇద్దరు ఆడ, ఒక మగ సంతానం ఉ నారు. కొన్నాళ్ల క్రితం తాజుద్దీన్ చనిపోవడంతో కండ్రికలో నివసిస్తూ పాయకాపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో రజియా నర్స్‌గా పనిచేస్తోంది.

02/17/2020 - 02:30

కోడూరు, ఫిబ్రవరి 16: ఎక్కడో గుంటూరు జిల్లా పెనుమూడి గ్రామానికి చెందిన విశ్వంశెట్టి ఉమా (48) అనే మహిళ చనిపోవటానికి సిద్ధపడి ఒక్కతే పాలకాయతిప్ప బీచ్ వైపు వడివడిగా వెళుతూ స్థానిక మత్స్యకారుల కంటపడి చివరకు పోలీసుల కౌన్సిలింగ్ అనంతరం కుటుంబ సభ్యులను కలిసిన సంఘటన కోడూరు మండలంలో శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత చోటు చేసుకుంది.

02/17/2020 - 02:20

ఖైరతాబాద్, ఫిబ్రవరి 16: తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల ప్రధాన ద్వారం విరిగిపడి బాలుడు మృతిచెందాడు. జూబ్లీహిల్స్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దమ్మనగర్‌లో నివాసం ఉండే మోహన్ కుమారుడు రాజేష్ స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో బోరబండలోని ఎన్‌ఆర్‌ఆర్‌పురంలోని తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల వద్దకు వచ్చాడు. గేటు ఎక్కి ఆడుతుండగా కుప్పకూలింది.

02/17/2020 - 02:20

కొత్తూరు రూరల్, ఫిబ్రవరి 16: కొత్తూరు పారిశ్రామికవాడలోని ఒక పత్తి మిల్లుల్లో మంటలు చెలరేగాయి. ఆదివారం సాయంత్రం షార్ట్ సర్కూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ప్రమాదం ఎలా జరిగింది..పత్తికి ఎలా నిప్పంటుకుందనే విషయంపై సమగ్ర విచారణ జరుపనున్నట్లు షాద్‌నగర్ రూరల్ సిఐ రామకృష్ణ తెలిపారు.

02/16/2020 - 05:02

చండీగఢ్, ఫిబ్రవరి 15: పంజాబ్‌లో శనివారం ఓ ఘోర ప్రమాదం జరిగింది. బడి పిల్లలను తీసికెళ్తున్న ఒక మినీ వ్యాన్‌లో మంటలు చెలరేగి, అందులో ప్రయాణిస్తున్న పిల్లల్లో నలుగురు సజీవ దహనమయ్యారు. సంగ్రూర్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, లోంగోవాల్- సిద్‌సమాచార్ రోడ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మినీ వ్యాన్‌లో 12 మంది పిల్లలు ఉన్నారు.

02/16/2020 - 02:55

పరిగి, ఫిబ్రవరి 15: బైక్ ను వెనుక నుంచి ట్రక్ డిట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినాడు. ఈ సంఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీదేవి పల్లి స్టేజి సమీపంలోని సుగుణ స్టీల్ కంపెని సమీపంలో శనివారం జరిగింది. పరిగి మున్సిపల్ టీచర్ కాలనిలో నివాసముంటున్న శంకర్ నాయక్(29) దోమ మండల పరిధిలోని దొంగఏనికే పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన పాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం .

02/16/2020 - 02:54

గచ్చిబౌలి, ఫిబ్రవరి 15: వాలెంటెన్స్ డే సందర్భంగా మాదాపూర్ ఐటీ కారిడార్ పరిధిలో ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా విధ్వంసం సృష్టించిన ఐదుగురిపై మాదాపూర్ పోలీసు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విధ్వంసం సృష్టించిన ఐదుగురిని అరెస్టు చేయగా మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.

02/16/2020 - 02:51

సైదాబాద్, ఫిబ్రవరి 15: విధినిర్వహణలో భాగంగా తాను చేయాల్సిన పనికి డబ్బు ముట్టచెప్పాల్సిందే అని డిమాండ్ చేసాడో ప్రభుత్వ విద్యాశాఖ అధికారి. న్యాయంగా తనకు రావాల్సిన సొమ్ము కోసం లంచం ఇవ్వటం ఇష్టం లేని సీనియర్ సిటిజన్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు బాధితుడు లంచం ఇస్తుండగా తీసుకున్న విద్యాశాఖ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Pages