S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/21/2019 - 01:51

పరిగి, జూన్ 20: ఉద్యోగినిని లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటన పరిగి పోలీస్ స్టేషన్ కేంద్రంలో గురువారం వెలుగులోకి వచ్చింది. పరిగి ఎస్‌ఐ చంద్రకాంత్ తెలిపిన వివరాల ప్రకారం ఉద్యోగిని పట్ల పరిగి ఆర్టీసీ డిపోలో కంట్రోలర్‌గా పని చేస్తున్న మల్లయ్య రెండు నెలలుగా వేధింపులకు పాల్పడుతున్నాడు. ఉన్నతాధికారులకు ఉద్యోగిని ఫిర్యాదు చేసింది. ఫలితం లేకపోవడంతో పరిగి పోలీసులను ఆశ్రయించింది.

06/21/2019 - 00:13

విశాఖపట్నం(క్రైం), జూన్ 20: అవినీతి నిరోధక శాఖాధికారులకు లంచం తీసుకుంటూ ఇద్దరు జీవీఎంసీ ఉద్యోగులు చిక్కారు. పట్టుబడిన వారిలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, టాక్స్ కలెక్టర్ ఉన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసి) జోన్-3లో ఆర్‌ఐగా హరగోపాల్, టాక్స్ కలెక్టర్‌గా కె.మహేష్ విధులు నిర్వహిస్తున్నారు.

06/20/2019 - 22:00

జామ్‌నగర్, జూన్ 20: లాకప్ డెత్ కేసులో ఐపీఎస్ అధికారి సంజీవ్‌భట్‌కు స్థానిక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 1990లో జామ్‌నగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌గా వ్యవహరించినప్పుడు ఆయన లాకప్‌డెత్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2002 గోద్రా అల్లర్లలో అప్పటి ప్రధాని నరేంద్ర మోదీ ప్రమేయమేమీ లేదని ఒక కేసులో ఆయన వాంగ్మూలం ఇచ్చాడు.

06/20/2019 - 21:56

బందా, జూన్ 20: సెక్యూరిటీ గార్డులు ఒక ట్రక్ డ్రైవర్‌ను కాల్చి చంపిన ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకొంది. హమీర్‌పూర్ జిల్లాలో గురువారం ఒక ర్యాంప్ నుంచి ఇసుకను తీసుకెళ్తూ తమకు ‘మామూలు’గా ఇవ్వాల్సిన 50 రూపాయిలకు బదులు ట్రక్ డ్రైవర్ 30 రూపాయిలు మాత్రమే ఇవ్వడంతో ఆగ్రహించిన సెక్యూరిటీ గార్డులు సదరు డ్రైవర్‌ను కాల్చి చంపినట్లు పోలీసులు చెప్పారు.

06/20/2019 - 21:22

లక్నో, జూన్ 20: ఉత్తర్‌ప్రదేశ్‌లో గురువా రం తెల్లవారు జామున ఒక వ్యాన్ కెనాల్‌లో పడిపోయింది. వ్యాన్‌లో ఉన్న ఏడుగురు పిల్లలు నీట మునిగిపోయారని భావిస్తున్నారు. మరో 22 మందిని రక్షించారు.

06/20/2019 - 21:15

రాయ్‌గఢ్, జూన్ 20: చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఒక అడవి ఏనుగు ఇద్దరిని తొక్కి చంపింది. ఈ ఇద్దరిలో ఒకరు ఫారెస్ట్ గార్డ్ ఉన్నారని అధికారులు గురువారం తెలిపారు. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌ఓ) ప్రణయ్ మిశ్రా కథనం ప్రకారం, ఫారెస్ట్ గార్డ్ ముకేశ్ పాండే (32) బుధవారం పోడి గ్రామానికి వెళ్లాడు.

06/20/2019 - 21:15

ఇటానగర్, జూన్ 20: అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఏఎన్-32 విమాన ప్రమాద ఘటనకు సంబంధించి గల్లంతైన వారిలో ఆరుగురి మృతదేహాలను వెలికితీసినట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రమాదానికి గురైన రష్యన్ విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా ఈ ఆరుగురి మృతదేహాలను సియాంగ్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కనుగొన్నారని సహాయ బృందాలు వెల్లడించాయి.

06/20/2019 - 21:14

జామ్‌నగర్, జూన్ 20: లాకప్ డెత్ కేసులో ఐపీఎస్ అధికారి సంజీవ్‌భట్‌కు స్థానిక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 1990లో జామ్‌నగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌గా వ్యవహరించినప్పుడు ఆయన లాకప్‌డెత్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2002 గోద్రా అల్లర్లలో అప్పటి ప్రధాని నరేంద్ర మోదీ ప్రమేయమేమీ లేదని ఒక కేసులో ఆయన వాంగ్మూలం ఇచ్చాడు.

06/20/2019 - 21:13

బందా, జూన్ 20: సెక్యూరిటీ గార్డులు ఒక ట్రక్ డ్రైవర్‌ను కాల్చి చంపిన ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకొంది. హమీర్‌పూర్ జిల్లాలో గురువారం ఒక ర్యాంప్ నుంచి ఇసుకను తీసుకెళ్తూ తమకు ‘మామూలు’గా ఇవ్వాల్సిన 50 రూపాయిలకు బదులు ట్రక్ డ్రైవర్ 30 రూపాయిలు మాత్రమే ఇవ్వడంతో ఆగ్రహించిన సెక్యూరిటీ గార్డులు సదరు డ్రైవర్‌ను కాల్చి చంపినట్లు పోలీసులు చెప్పారు.

06/20/2019 - 21:12

మాండ్లా (మధ్యప్రదేశ్), జూన్ 20: మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలో గురువారం దారుణం చోటుచేసుకుంది. నర్మదా నదిపై 15మందితో ప్రయాణిస్తున్న నాటు పడవ మునిగిపోవడంతో ఐదుగురు గల్లంతయ్యారు. వీరిలో నలుగురు మహిళలు కాగా ఒక ఉన్నారు. వీరి ఆచూకీ ఇంతవరకూ తెలియలేదు. మరో పదిమంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరడంతో భారీ ప్రమాదం తప్పింది.

Pages