-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
నిజామాబాద్, జూన్ 19: భూ తగాదాకు సంబంధించిన ఫిర్యాదు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన నవీపేట ఏఎస్ఐ జాన్సన్ తగిన మూల్యాన్ని చెల్లించుకున్నారు. ఓ బాధితుడిని పోలీస్స్టేషన్కు పిలిపించుకుని, అతని పట్ల కరడుగట్టిన నేరస్థుడి తరహాలో తీవ్రంగా చితకబాదడాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు సదరు ఏఎస్ఐను సస్పెండ్ చేశారు.
నిజామాబాద్: ఓ కల్లు దుకాణం నిర్వాహకుడి నుంచి లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ, ఎస్ఐలను అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ ప్రసన్నరాణి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్, జూన్ 19: ఇంటర్మీడియట్ మూల్యాంకనం, ఫలితాల్లో నెలకొన్న గందరగోళంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఆదేశించలేమని హైకోర్టు ధర్మాసనం బుధవారం నాడు తేల్చి చెప్పింది.
హైదరాబాద్, జూన్ 19: సినీ నటుడు శొంఠినేని శివాజీ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై బుధవారం నాడు విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని శివాజీ క్వాష్ పిటీషన్ ద్వారా విన్నవించారు. పోలీసులు ముందస్తు అరె స్టు చేయకుండా స్టే ఇవ్వాలని పిటిషన్లో కోరారు.
భద్రాచలం టౌన్, జూన్ 19: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ దండకారణ్యంలోని బీజాపూర్ జిల్లాలో సమాజ్వాదీ పార్టీ నేత పూనెం సంతోష్ను మావోయిస్టులు కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎస్పీ తరుపున సంతోష్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సంతోష్ గుత్తేదారుడిగా పలు నిర్మాణ పనులు చేపడుతున్నారు.
కోడూరు, జూన్ 19: భార్య, భర్తల మనస్పర్దలు, అపర్దాలతో నిండు ప్రాణం బలి తీసుకున్న సంఘటన కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని అంబటి బ్రాహ్మణయ్య కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. కాలనీలో పుట్టింటికి వచ్చిన బెజవాడ ధనలక్ష్మి భర్త శివతో మంగళవారం రాత్రి గొడవపడి బాత్ రూమ్లోకి వెళ్లి గడియ పెట్టుకుని ఉరి వేసుకుని చనిపోయింది.
పెనమలూరు, జూన్ 19: ఒక మహిళ అక్రమ సంబంధం వ్యవహారం మరో అమాయకురాలి ప్రాణాలను బలిగొంది. మరిదితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ పెళ్లయ్యాక తనను దూరం పెడుతున్నాడన్న కక్షతో అంతమొందించాలని చేసిన ప్రయత్నం ఆమె ఆడపడుచు ప్రాణాలు తీసింది. మరిది, తోటికోడలు, ఆడపడుచు గదిలో కూర్చొని మాట్లాడుకుంటుండగా ఆమె పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ దాడిలో ఆమె ఆడపడుచు హుజున్ని (50) మంటల్లో కాలి మృతి చెందింది.
గన్నవరం, జూన్ 19: నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న 532 బస్సులపై కేసులు నమోదు చేసి 326 బస్సులను సీజ్ చేసినట్లు డీటీసీ మీరాప్రసాద్ తెలిపారు. బుధవారం గన్నవరంలో పాఠశాలల, కళాశాలల బస్సులను విస్తృత తనిఖీలు చేశారు. రవీంద్రభారతి స్కూల్ బస్సుకు మెట్టు లేకపోవడంతో కేసు నమోదు చేశారు. డ్రైవర్కు 60 సంవత్సరాలు నిండినందునా అతనిపై కేసు నమోదు చేశారు.
కొత్తూరు రూరల్, జూన్ 19: భర్త అనుమానాస్పదంగా మృతి చెందాడంటూ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్నర్వ గ్రామంలో చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్ఐ కృష్ణ కథనం ప్రకారం.. ఇన్ముల్నర్వ గ్రామానికి చెందిన యాదయ్య (45) అనే వ్యక్తి జూన్ 10వ తేదిన విద్యుత్ షాక్కుగురై మృతి చెందినట్లు వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని వివరించారు.
ఘట్కేసర్, జూన్ 19: నిషేధిత గుట్కాలను అక్రమంగా నిలువ చేసి విక్రయస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి గుట్కా పాకెట్లను, నగదు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధి చౌదరిగూడ గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం..