-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
గరిడేపల్లి, జూన్ 11 : మద్యానికి బానిసై వేధిస్తూ నిత్యం కొడుతూ, దూషిస్తూ కసాయిగా మారిన కొడుకుని కన్నతల్లే కడతేర్చిన సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని సుభాష్ నగర్ (కొత్తపోడు) గ్రామానికి చెందిన బెజ్జం సతీష్ అలియాస్ చంటి (28)ని తల్లి మరియమ్మ హతమార్చింది. సతీష్కు తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహం జరగ్గా ఇద్దరు పిల్లలున్నారు.
హైదరాబాద్, జూన్ 11: మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో మంగళవారం నాడు పిటీషన్ దాఖలైంది. వార్డుల విభజన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయడం లేదని పిటీషనర్ పేర్కొన్నారు. 53 మున్సిపాల్టీలకు రాష్ట్రంలో జూలై 2వ తేదీతో గడువు ముగుస్తుందని, ఇప్పటి నుండి ఏర్పాట్లు చేయకపోతే ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదని పిటీషనర్ పేర్కొన్నారు.
గచ్చిబౌలి, జూన్ 11: సినిమాలు, టీవీ సిరియల్స్, క్రైం కథనాలు సమాజంపై ప్రభావం చూపిస్తాయనడంతో సందేహం లేదు. టెలివిజన్లో వచ్చే క్రైం కథనాలను చూసిన కొందరు మంచివారిగా మారితే ఇంకొంతమంది కిల్లర్గా మారుతున్నారు. మాట్రిమోనీ మోసాలను టీవీలో చూసిన యువతి కిల్లర్గా మారింది.
యాచారం, జూన్ 11: రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొని వృద్ధుడు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన యాచారం పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి యాచారం పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని తక్కళ్లపల్లి తండాకు చెందిన వర్త్యావత్ హనుమ (60) కూలిపనులు చేస్తున్నాడు.
మేడ్చల్, జూన్ 11: రోడ్డు ప్రమాదంలో తనయుడి కళ్ల ముందే తల్లి దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం మెదక్ తుప్రాన్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ(55) కుమారుడు పవన్ గౌడ్(27)తో కలిసి ద్విచక్ర వాహనంపై మంగళవారం వెళుతుండగా మేడ్చల్ 44వ జాతీయ రహదారి చెక్పోస్టు వద్ద కంటైనర్ లారీ ఢీకొట్టింది.
వనస్థలిపురం, జూన్ 11: అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఐదు లక్షల రూపాయల విలువ చేసే 82 కిలోల గంజాయి, రూ.30 వేల నగదు, ఏడు మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
జీడిమెట్ల, జూన్ 11: మనస్థాపంతో ఓ పూజారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జయరామ్నగర్లో నివాసముండే మడపతి జగదీశ్వర్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. ఇతని కుమారుడు మడపతి వినయ్ కుమార్ (22) కాలనీలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తాడు. తండ్రి జగదీశ్వర్కు తెలియకుండా వినయ్ కుమార్ అకౌంట్ నుండి రూ.70వేలు విత్డ్రా చేశాడు.
హైదరాబాద్, జూన్ 11: శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల విలీనానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లలో శాసనసభ స్పీకర్కూ, శాసనమండలి చైర్మన్కూ హైకోర్టు మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు శాసనసభ కార్యదర్శికి, ఎన్నికల కమిషన్కూ హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
కరీంనగర్, జూన్ 11: ‘నేను జడ్జీని మాట్లాడుతున్నాను.. మీపై పీడీ కేసు ఉంది కదా? నాకు కొంచెం సొమ్ము ముట్టచెబితే దానిని మాఫీ చేస్తాను’ అంటూ ఏకంగా న్యాయమూర్తుల పేరుతో పలువురిని మోసం చేసి కాసులు దండుకున్న వ్యక్తిని మంగళవారం కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్, జూన్ 11: టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ముందస్తు బెయిల్కు సంబంధించిన పిటిషన్పై హైకోర్టులో మంగళవారం నాడు సుదీర్ఘవాదనలు జరిగాయి. రవిప్రకాశ్ను కావాలనే పలు కేసుల్లో ఇరికించారని ఆయన తరఫున న్యాయవాది పేర్కొనగా, రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడ్డారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసుల తరఫున న్యాయవాది చెప్పారు.