-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
న్యూఢిల్లీ, జూన్ 10: మనుషుల్లో మానవత్వం నానాటికీ మంటకలిసి పోతోంది. ‘కంటే కూతురినే కనాలి’ అని చెప్పుకోవడానికి బాగానే ఉన్నా దీనికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించిన కసాయి కూతురు ఉదంతమిది. 78 సంవత్సరాల తన కన్న తల్లిని దారుణంగా శారీరకంగా, మానసికంగా వేధించి, హింసించి ఆఖరికి తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోంలో పడేసిన వైనం చూస్తే ఎవరైనా కంట తడి పెట్టక మానరు.
సిద్దవటం, జూన్ 9: కడప జిల్లాలో ఇసుక మాఫియా బరితెగించింది. పెన్నానది నుంచి ఇసుక అక్రమంగా తరలించడమేగాక అడ్డుకోబోయిన అధికారుల ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడడం లేదు. తాజాగా ఆదివారం జరిగిన సంఘటన ఇందుకు బలం చేకూరుస్తోంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోబోయిన సిద్దవటం వీఆర్వో ఆరిఫ్, వీఆర్ఏ వెంకటపతిని ట్రాక్టర్తో గుద్దించడంతో వారు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.
సనత్నగర్, జూన్ 9: రెండు రోజుల క్రితం సంజీవరెడ్డినగర్ (ఎస్సార్నగర్) పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన హత్యాయత్నం కేసులో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆదివారం ఎస్సార్నగర్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస వివరాలను వెల్లడించారు.
జీడిమెట్ల, జూన్ 9: ఓ టిప్పర్ లారీ అదుపుతప్పి ఓ షెడ్డులోకి దూసుకెళ్లి ఇద్దరు మరణానికి కారణమైంది. ఓ చిన్నారి పాప, ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చత్తీస్గడ్ రాష్ట్రం, సుర్గుజ జిల్లా, ఉదయ్పూర్కు చెందిన ప్యారేలాల్ (34), బబ్లు విశ్వకర్మాస్ సోదరులు.
ఉప్పల్, జూన్ 9: వేగంగా వెళ్తున్న బైక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి మెట్రో రైలు ఫిల్లర్కు ఢీకొంది. ప్రమాదంలో ఐటీఐ విద్యార్థి దుర్మరణం చెందగా మరొక విద్యార్థి గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఎల్బీనగర్ మన్సురాబాద్లో నివసిస్తున్న గాదె సంజయ్ అలియాస్ సన్నీ (20) ఐటీఐ చేస్తున్నాడు.
వరంగల్, జూన్ 9: వరంగల్ నిట్లో మరోసారి గంజాయి కలకలం రేపుతోంది. గతంలో నిట్లో ఇలాంటి సంఘటనలు అనేకం జరగగా ఇటీవల కాలంలో సద్దుమణిగినప్పటికీ తిరిగి తాజాగా ఆదివారం వరంగల్ నిట్ విద్యార్థులకు గంజాయి విక్రయించేందుకు వచ్చిన నలుగురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు.
వంగూరు, జూన్ 9: సెలవులు గడపడానికి ఇంటికి వచ్చిన ఒక జవాన్ రోడ్ ప్రమాదంలో మృతి చెందాడు. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండల పరిధిలోని సర్వారెడ్డిపల్లి తండా దగ్గర అచ్చంపేటకు చెందిన జవాను సోమా రాజశేఖర్ (38)అనే వ్యక్తి ఆదివారం కారు ప్రమాదంలో మృతి చెందాడు. అతనితో పాటు కారులో ప్రయాణిస్తున్న అచ్చంపేటకు చెందిన మహేష్కు తీవ్ర గాయాలయ్యాయ.
శ్రీశైలం టౌన్, జూన్ 8 : కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీశైలం ఘాట్ రోడ్డులో శనివారం ఉదయం ఓ టూరిస్టు బస్సు బోల్తా పడిన సంఘటనలో 30 మందికి పైగా గుజరాత్కు చెందిన భక్తులు గాయపడ్డారు. తీర్థయాత్రలో భాగంగా 120 మంది భక్తులు గుజరాత్ నుంచి తమిళనాడుకు రైలులో వచ్చి అక్కడి నుంచి 3 బస్సుల్లో శ్రీశైలం వచ్చి మల్లన్నను దర్శించుకుని తిరుగు పయనమయ్యారు.
తిరుపతి, జూన్ 8: బస్సు, ఆటో ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతిచెందగా పలువురు గాయపడిన సంఘటన తిరుపతి మదనపల్లి మార్గంలోని భాకరాపేట ఘాట్లో శనివారం జరిగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని వేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. కాగా అకారణంగా ముగ్గురు వ్యక్తుల మృత్యువుకు కారణమైన డ్రైవర్ను అటుగా వస్తున్న కొంతమంది ప్రయాణికులు చితకబాదారు.
తాండూరు,జూన్ 8: తాండూరు రైల్వే సెక్షన్ పరిధిలోని మంతట్టి రైల్వే స్టేషన్లో వేగంగా దూసుకు వస్తున్న ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని ఓక యువకుడు దుర్మరణం పాలైన సంఘటన జరిగింది. తాండూరు రైల్వే పోలీసులు రైల్వే ఎస్ఐ రాఘవేందర్గౌడ్ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.