S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/09/2019 - 02:10

రాజేంద్రనగర్, జూన్ 8: గుర్తు తెలియని కారు ఢీకొనడంతో పాదచారుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పాతపాలెం గ్రామానికి చెందిన ముమ్మల్ల పద్మమ్మ, రాములు(45)లు భార్యభర్తలు. వీరు బతుకుదెరువు కోసం నగరంలోని శంషాబాద్‌లో ఉంటూ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం పని నిమిత్తం బయటకు వెళ్లాడు.

06/09/2019 - 02:10

రాజేంద్రనగర్, జూన్ 8: ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్న వ్యక్తిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్‌చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హసన్‌నగర్‌లో నివాసం ఉండే జమీల్. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో క్షుద్రపూజలు నిర్వహిస్తూ ఇంట్లో మాంసం కొడుతున్నాడు. దీంతో చుట్టుపక్కల వారు గమనించి జమీల్‌ను పిలిచి విచారించగా శాంతి పూజలు చేయిస్తున్నానని బదులిచ్చాడు.

06/09/2019 - 02:09

జీడిమెట్ల, జూన్ 8: లారీ ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. అంబర్‌పేట్‌లో నివాసముండే ఎండీ మోబీన్ షరీఫ్ వ్యాపారం చేస్తుంటాడు. కుమారులు ఎండీ మక్దుమ్ షరీఫ్ (20), ఎండీ ఉమర్ షరీఫ్ (18)లు చదువుకుంటున్నారు. వీరితో పాటు సమీప బంధువైన సయ్యద్ ఇలియాస్ (18) ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనం పై మేడ్చల్ నుంచి సుచిత్ర వైపు వెళ్తున్నారు.

06/09/2019 - 02:09

వనస్థలిపురం, జూన్ 8: అక్రమంగా నాటు తుపాకులను రవాణ చేస్తూ నగరంలో అమ్ముతున్న ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

06/09/2019 - 02:08

రాజేంద్రనగర్, జూన్ 8: పీవీ ఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై కారు బోల్తా పడిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మెహదీపట్నం నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు పిల్లర్ నెంబర్ 303 వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. ఎలాంటి ప్రాణాపాయం చోటుచేసుకోలేదని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.

06/08/2019 - 23:45

అచ్చంపేట, జూన్ 8: చిత్తుగా తాగిన మైకంలో ఉన్న కొడుకు నిద్రిస్తున్న తల్లిని కొట్టి చంపి, తర్వాత దానిని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి యత్నించిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ.

06/08/2019 - 23:44

హైదరాబాద్, జూన్ 8: ఇస్మార్ట్ శంకర్ చిత్రం విడుదల కాక ముందే సామాజిక మాధ్యమాల్లో సినిమా స్క్రిప్ట్ లీక్ చేశారంటూ ఆ చిత్ర సహ నిర్మాత సైబారాబాద్ పోలీసులను ఆశ్రయించారు. రామ్ కధానాయకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ విడుదలకు ముందే సామాజిక మాధ్యమాల్లో సినిమా స్క్రిప్ట్ లీక్ చేశారంటూ ఆ చిత్ర సహ నిర్మాత ఛార్మి సైబారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

06/08/2019 - 23:42

హైదరాబాద్, జూన్ 8: టీవీ 9 లోగో విక్రయం విషయంలో ట్రేడ్‌మార్క్ కాపీ రైట్స్ ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాష్ రెండోరోజు శనివారం బంజారాహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతూ విచారణను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని తెలిసింది.

06/07/2019 - 23:11

ముంబయి, జూన్ 7: భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మాలేగావ్ పేలుళ్లకేసులో శుక్రవారం ఇక్కడ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. 2008నాటి పేలుళ్ల కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. కేసు విచారణకు హాజరుకావల్సి ఉండగా ఈవారంలోరెండు సార్లు గైర్హాజరయ్యారు. కాషాయ దుస్తులు ధరించి ప్రజ్ఞా కోర్టుకు హాజరయ్యారు. ఇద్దరు అనుచరులను వెంటబెట్టుకుని ఆమె కోర్టు హాలులోకి ప్రవేశించారు.

06/07/2019 - 23:07

న్యూఢిల్లీ, జూన్ 7: జాతీయ పౌర రిజిస్టర్ మరో రెండు నెలల్లో ప్రచురితం కానున్న తరుణంలో ఈ జాబితాలో చోటుదక్కని వ్యక్తుల విషయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అలాంటి వ్యక్తులు విదేశీయుల ట్రిబ్యునళ్లను ఆశ్రయించవచ్చని సూచించింది. పూర్తి రికార్డులతో ట్రిబునళ్లను ఆశ్రయిస్తే నాలుగు నెలల్లో అంతిమ తీర్పును వెలువరించి, పూర్తి వివరాలతో కూడిన రికార్డులను అందజేసే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది.

Pages