S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/12/2020 - 01:31

కేపీహెచ్‌బీకాలనీ, ఫిబ్రవరి 11: అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని కేపీహెచ్‌బీ పోలీసులు, ఎస్ ఓటీ పోలీసులు దాడి చేసి నాలుగు లక్షల విలువ చేసే రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే....

02/11/2020 - 23:39

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుకు సమాధానం ఇవ్వవలసిందిగా ఈ కేసులోని మరణ శిక్ష పడిన నలుగురు ముద్దాయిలను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ నలుగురు ముద్దాయిలకు విధించిన ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

02/11/2020 - 23:37

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: నిర్భయ గ్యాంగ్ రేప్, హత్యోదంతంలో దోషులకు తాజాగా డెత్ వారంట్‌లు జారీ చేయాలని మృతురాలి తల్లిదండ్రులు ఢిల్లీ కోర్టును మంగళవారం ఆశ్రయించారు. తక్షణమే ఢిల్లీ కోర్టు స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు. అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఈమేరకు దోషులకు నోటీసులు జారీ చేస్తూ ఈ అంశాన్ని బుధవారం విచారించనున్నట్లు పేర్కొన్నారు. నిర్భయ దోషులు చట్టంతో చెలగాటం ఆడుతున్నారనీ..

02/12/2020 - 02:06

న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో గల ఒక షెల్టర్ హోమ్‌లో అనేక మంది బాలికలపై లైంగికంగా, భౌతికంగా దాడికి పాల్పడిన బ్రిజేశ్ ఠాకూర్‌కు ఢిల్లీలోని ఒక కోర్టు మంగళవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఠాకూర్ తుది శ్వాస విడిచేంత వరకు కారాగార శిక్షను అనుభవించాలని కోర్టు ఆదేశించింది.

02/11/2020 - 05:51

మహబూబాబాద్, ఫిబ్రవరి 10: మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని అమనగల్ శివారులో 24 సంవత్సరాల అక్షర (పేరు మార్చారు)పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ తొమ్మిదిమంది నిందితుల్లో ఎనిమిది మందిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఇదే కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ సంఘటన వివరాలను వెల్లడించారు.

02/11/2020 - 05:30

తిరుపతి: శ్రీవారికి నిర్వహించే అభిషేకం, సుప్రభాత ఆర్జిత సేవలకు సంబంధించి నకిలీ టికెట్లను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న చెన్నయ్‌కి చెందిన ఓ ముఠా గుట్టును టీటీడీ విజిలెన్స్ అధికారులు రద్దు చేశారు. ఈ సంఘటనలో రూ. 73వేలు తీసుకుని మోసం చేసినట్లు వెబ్‌సైట్ ద్వారా టీటీడీ విజిలెన్స్ అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

02/11/2020 - 05:25

రాజమహేంద్రవరం: మహిళలపై వేధింపులు, అకృత్యాల నిరోధానికి రాష్ట్రంలోనే ప్రథమంగా ముఖ్యమంత్రి ప్రారంభించిన రాజమహేంద్రవరం దిశ పోలీసు స్టేషన్‌లో ఒక మహిళా ఎమ్మెల్యే ఫిర్యాదుచేశారు. అసెంబ్లీలో తాను చేసిన ప్రసంగాన్ని అవహేళన చేస్తూ తన ఫోటోలతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని (టీడీపీ) బుధవారం ఈ ఫిర్యాదుచేశారు.

02/11/2020 - 05:20

విజయవాడ, ఫిబ్రవరి 10: మద్యం ధరల పెంపును సవాల్ చేస్తూ మద్యం వ్యాపారుల రాష్ట్ర సంఘం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ 17వ తేదీకి వాయిదా పడింది. బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్స్‌లను డిసెంబర్ మాసంలోనే అర్ధంతరంగా రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కాగా అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం భంగపాటుకు గురైంది.

02/11/2020 - 02:04

చల్లపల్లి, ఫిబ్రవరి 10: విజయవాడ నుండి కరకట్ట మీదుగా అవనిగడ్డ వస్తున్న ఆర్టీసీ బస్సు మార్గ మధ్యలో మండల పరిధిలోని మేకావారిపాలెం సమీపంలో అదుపు తప్పి బోదెలోకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పింది. 40 మంది ప్రయాణీకులు ఉన్న ఆర్టీసీ బస్సు ముందు ఉన్న చెరకు బండ్లను తప్పించే క్రమంలో అదుపు తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు.

02/11/2020 - 01:58

జీడిమెట్ల, ఫిబ్రవరి 10: ఫుడ్ ఆర్డర్ ఇచ్చి వచ్చిన డెలివరీ బాయిపై దాడి చేసి నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జీడిమెట్ల పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బాలానగర్ ఏసీపీ పురుషోత్తం, జగద్గిరిగుట్ట సీఐ గంగారెడ్డిలు నిందితుల వివరాలను వెల్లఢించారు.

Pages