-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
పంచ్కుల (హర్యానా): పిరికిపందలు పాల్పడిన హింసాత్మక చర్యలో విశ్వసనీయమయిన, అంగీకార యోగ్యమయిన ఆధారాలు లేనందు వల్ల ఎవరికీ శిక్ష పడకుండా పోయిందని సంఝౌతా ఎక్స్ప్రెస్ పేలుడు కేసులో తీర్పు ఇచ్చిన పంచ్కులలోని ప్రత్యేక కోర్టు వ్యాఖ్యానించింది. సంఝౌతా ఎక్స్ప్రెస్ పేలుడు కేసులో స్వామి అసీమానంద సహా మొత్తం నలుగురు నిందితులను ఈ కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
జీడిమెట్ల, మార్చి 28: గుర్తు తెలియని కుళ్లిపోయిన వ్యక్తి మృతదేహాన్ని దుందిగల్ పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. పోలీసులు కథనం ప్రకారం.. సూరారం గ్రామం విశ్వకర్మ కాలనీ సమీపంలోని అటవి ప్రాంతంలో సుమారు 40-45 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కుళ్లి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉప్పల్, మార్చి 28: అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఉప్పల్ అన్నపూర్ణకాలనీలో నివసిస్తున్న వలిగొండ మండలం పరిధిలోని కంచెనపల్లి గ్రామానికి చెందిన పన్నాల అనంతరెడ్డి భార్య స్వప్న (32)కు ఇద్దరు పిల్లలు. మహేంద్ర కంపెనీలో పని చేస్తున్న భర్త అనంతరెడ్డి భార్యను తరుచూ ఇబ్బందులు పెడుతున్నాడు.
మేడ్చల్, మార్చి 28: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ కొల్లు నాయుడు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధిపేట్ జిల్లా మాసాయిపేట గ్రామానికి చెందిన రాజు అతని బావమరిది యాదగిరి(22)తో కలిసి గురువారం ఉదయం బైక్పై అయోధ్య క్రాస్ రోడ్డు వస్తుండగా మేడ్చల్ పట్టణ ప్రధాన కూడళి అంబేద్కర్ విగ్రహం వద్ద అతి వేగంగా లారీ వచ్చి వీరి బైక్ను ఢీకొట్టింది.
గచ్చిబౌలి, మార్చి 28: మహారాష్టత్రో పాటు తెలంగాణ పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న కరుడుగట్టిన అంతర్ రాష్ట్ర ఘరానా దొంగను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నుంచి 20లక్షల విలువ చేసే 62 తులాల బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుడి వివరాలను వివరించారు.
సైదాబాద్, మార్చి 28: ఆటల్లో గాయమయితేనే అల్లాడి పోయే వయసు.. కోపమో.. బాధో కలిగితే అలగటమో.. వెక్కివెక్కి ఏడవటమో.. మాత్రమే చేసే ప్రాయం.. అలాంటిది పరీక్షల సమయంలో చదువుకోమని తల్లిదండ్రులు మందలించినందుకు ఏకంగా ప్రాణం తీసుకున్నాడు.
పులివెందుల, మార్చి 28: మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్లు డీఎస్పీ నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివేకా హత్యకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసిన కేసులో ఎర్ర గంగిరెడ్డి, ప్రకాష్, కృష్ణారెడ్డిని అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేమన్నారు.
విజయవాడ, మార్చి 28: లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఏప్రిల్ 3వ తేదీ వరకూ ఈ సినిమా ప్రదర్శించకూడదని ఆదేశించింది. ఏప్రిల్ 3న సాయంత్రం 4 గంటలకు న్యాయమూర్తి చాంబర్లో ఈ సినిమా ప్రదర్శించాలని ఆదేశించింది. సినిమా చూశాక తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని, ఈ చిత్ర ప్రదర్శనకు చిత్ర నిర్మాత కూడా హాజరు కావాలని ఆదేశించింది.
బోధన్, మార్చి 27: నిజామాబాద్ జిల్లా బోధన్ బల్దియా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జవాన్ సురేష్గౌడ్లు ఏసీబీ వలలో చిక్కారు. బల్దియా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చనిపోగా ఆయన కుమారుడిని విధుల్లో చేర్చుకునేందుకు లంచం డిమాండ్ చేసి కటకటాల పాలయ్యారు.
ములకలచెరువు, మార్చి 27: చిత్తూరు జిల్లా ములకల చెరువు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టులో బుధవారం పోలీసులు తనిఖీల్లో రూ.కోటి 86లక్షల 24వేల 390రూపాయలు నగదు సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ములకలచెరువు ఎస్ఐ నాగేంద్ర ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బోసిస్కో వాహనం తనిఖీ చేసినట్లు తెలిపారు. ఆ వాహనంలో ఆరు ట్రంక్ బాక్సులలో నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.