S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/22/2019 - 23:45

శ్రీనగర్, మార్చి 22: జమ్మూకాశ్మీర్‌లోని బండిపొర, షోపియాన్ జిల్లాల్లో శుక్రవారం జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు మిలిటెంట్లు హతమయ్యారు. ఇందులో ఒక ఆపరేషన్ సందర్భంగా ఉగ్రవాదులు తమ వద్ద బందీగా ఉన్న ఒక బాలుడిని కిరాతకంగా హతమార్చారు. హతమయిన ఐదుగురు మిలిటెంట్లలో ఇద్దరు పాకిస్తాన్‌కు చెందిన వారు ఉన్నారు.

03/22/2019 - 22:46

న్యూఢిల్లీ, మార్చి 22: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో గతనెలలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను హతమార్చిన ఘటనలో ప్రధాన సూత్రధారి ముదాసిర్ సన్నిహితుడు జైషే మహమ్మద్ టెర్రరిస్టు సజ్జద్ ఖాన్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పుల్వామాకు చెందిన 27 ఏళ్ల సజ్జద్ ఖాన్‌ను గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత లజ్‌పత్ రాయ్ మార్కెట్‌లో అరెస్టు చేసినట్టు పోలీసులు ధృవీకరించారు.

03/22/2019 - 22:36

ముంబయి, మార్చి 22: మహారాష్టల్రో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. విజయ్‌కుమార్ భగవత్ పవార్ (57) అనే ఐఏఎస్ అధికారి ఎయిర్ గన్‌తో భార్యపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. తరువాత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోలాపూర్ జిల్లాలోని మంగల్‌వేధా పట్టణంలో శుక్రవారం తెల్లవారు జామున ఈ విషాదం జరిగింది. పవార్ ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు.

03/22/2019 - 22:35

ముంబయి, మార్చి 22: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ని నిండాముంచి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు కొత్త ఎత్తుగడ వేశాడు. గుండె సమస్య, తీవ్రమైన కాలునొప్పి, మెదడులో రక్తం గడ్డకట్టడం వంటి రుగ్మతలతో బాధపడుతున్నందున భారత్‌కు రాలేనని చెప్పుకొచ్చాడు. ఈమేరకు కోర్టులో శుక్రవారం ఛోక్సీ పిటిషన్ దాఖలు చేశాడు.

03/22/2019 - 03:00

మహబూబ్‌నగర్, మార్చి 21: ప్రేమించిన వాడితో పెళ్లి జరపకుండా మరో వ్యక్తితో పెళ్లి జరపడం పట్ల ఆ యువతి తిరిగి తమ గ్రామానికి వచ్చి ప్రియుడితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన నాగరాజు (30), రామేశ్వరి (23) అనే ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు.

03/22/2019 - 02:41

నాగలాపురం/తిరుపతి, మార్చి 21: చిత్తూరు జిల్లా సుటుపల్లి చెక్‌పోస్టు, తిరుపతి అర్బన్ జిల్లాల్లో అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగలాపురం మండలంలోని సురుటుపల్లిలో ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్ దగ్గర గురువారం సాయంత్రం రూ. 20లక్షల మూడువేల 900 రూపాయలు నగదు పట్టుకుని సీజ్ చేసినట్లు ఎన్నికల నిఘా అధికారి కోమలేశ్వరి తెలిపారు.

03/22/2019 - 02:23

బాసర, మార్చి 21: నిర్మల్ జిల్లా పరిధిలోని బాసర ఆలయం వద్ద గురువారం హోలీ పర్వదినం రోజున సైకో వీరంగం సృష్టించాడు. అప్రమత్తమైన సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిజామాబాద్‌కు చెందిన ప్రకాష్‌గౌడ్ అమ్మవారి దర్శనానికి గర్భాలయంలోకి వస్తుండగా గమనించిన హోంగార్డు సిబ్బంది అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా వారిపై కత్తిచూపించి బెదిరించేందుకు ప్రయత్నం చేశాడు.

03/22/2019 - 01:58

మధురై: తమిళనాడులోని దినకరన్ అనే తమిళ పత్రికపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను హత్య చేసిన కేసులో తొమ్మిది మందికి జీవిత ఖైదును విధిస్తూ మద్రాసు హైకోర్టు బెంచి తీర్పు వెలువరించింది. ఈ ఘటన 2007లో జరిగింది. ఆ ఏడాది మే 5వ తేదీన జరిగిన ఈ ఘటనలో గోపీనాథ్, వినూత్, ముథరమాలింగంలు హత్యకు గురయ్యారు. ఈ కేసులో 2009 డిసెంబర్ 9వ తేదీన 17 మంది వ్యక్తులు నిర్దోషులంటూ కోర్టు వారిని విడుదల చేసింది.

03/22/2019 - 01:21

విజయవాడ (క్రైం), మార్చి 21: ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిబంధనల అతిక్రమణకు పాల్పడేవారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని నగర పోలీసుశాఖ స్పష్టం చేస్తోంది. ఎన్నికల ప్రచారంలోనూ.. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియలోనూ ఎన్నికల కోడ్‌కు లోబడి వ్యవహరించాల్సిన అభ్యర్థులు గీత దాటితే వారిపై చట్టపరచర్యలకు నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఏమాత్రం వెనుకాడటం లేదు.

03/22/2019 - 01:17

ఖైరతాబాద్, మార్చి 21: తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ యువకుడు తాను అర్ధంతరంగా తనువు చాలించిన సంఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌లో నివాసం ఉండే ముత్యాల నర్సింహ రాజు కుమారుడు చంద్రజిత్ (24) ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. వ్యయామంపై మక్కువ కలిగిన ఇతను వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు సైతం హాజరయ్యేవాడు.

Pages