-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
న్యూఢిల్లీ, జనవరి 18: దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్య తీవ్రత, ట్రాఫిక్ రద్దీకి సంబంధించిన చర్యలను సరైన రీతిలో అమలుచేయడం లేదంటూ సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఢిల్లీ ఓ గ్యాస్ ఛాంబర్గా మారిపోయిందని, ఇక్కడ ఉండకపోవడమే మంచిదన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ, జనవరి 18: ఉత్తరప్రదేశ్లో అక్రమ మైనింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా కొరడా ఝళిపించింది. ఐఏఎస్ అధికారిణి బీ చంద్రలేఖ, సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ, ఇద్దరు అధికారులకు ఈడీ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. అలాగే మనీలాండరింగ్ కేసులు నమోదు చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సంచలనం రేపిన అక్రమ ఇసుక తవ్వకాల కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
శ్రీనగర్, జనవరి 18: కాశ్మీర్లో శుక్రవారం జరిగిన హిమపాత ప్రమాదంలో పది మంది దర్మరణం చెందారు. లడక్ ప్రాంతంలోని ఖార్దుంగ్ల ప్రాంతంమీదుగా వెళుతున్న రెండు లారీలను హిమపాతం ముంచెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు మృతదేహాలను వెలికితీయ గలిగారు మిగతా ఐదుగురు బతికుండే అవకాశాలు లేవని అధికార వర్గాలు తెలిపాయ.
గూడూరు, జనవరి 18 : జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, అందులో భాగంగానే డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రణాళికలు సిద్ధం చేశామని జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లు పరిశీలించడానికి వెళుతూ మండల కేంద్రమైన చిల్లకూరు పోలీస్స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు.
చింతూరు, జనవరి 18: తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టు మిలీషియా సభ్యులు రెచ్చిపోయారు. వారపు సంతకు వచ్చిన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యాపారులను చితకబాది, వారికి చెందిన టాటా ఏస్ వాహనాన్ని దగ్ధంచేశారు. చింతూరు మండలం పేగ గ్రామంలో పట్టపగలే ఈ ఘాతుకం చోటుచేసుంది. వివరాలిలా ఉన్నాయి..
దేవరపల్లి, జనవరి 18: వ్యక్తిగత ఘర్షణకు సంబంధించిన కేసులో తగిన చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదుదారు అయిన మహిళ నుండి రూ.5000 లంచం తీసుకుంటూ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ఏఎస్సై) ఒకరు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు చిక్కారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి పోలీసు స్టేషన్లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
నెల్లిమర్ల, జనవరి 18: విజయనగరం జిల్లా నెల్లిమర్ల యాతవీధి ప్రాంతంలో శుక్రవారం హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. అప్పుడే జన్మించిన ఆడ శిశువుని వీధి శివార్లలో గుర్తు తెలియని మాతృమూర్తి విడిచిపెట్టింది. స్థానికుల వివరాల మేరకు రామతీర్థం జంక్షన్ శ్రీనివాస థియేటర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున అప్పుడే పుట్టిన ఆడ శిశువును కుక్కలు, పందులు విచక్షణా రహితంగా పీక్కుతినడాన్ని స్థానికులు గుర్తించారు.
నిజామాబాద్, జనవరి 17: ఎడారి దేశాలకేగి ఎక్కువ డబ్బులు సంపాదించాలనే యువకుల తపన వారి నిండు ప్రాణాలను బలిగొంటోంది. ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశాలలో పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకపోవడంతో, పుట్టెడు అప్పులు చేసి అక్కడికి వెళ్తున్న యువకులు తారుమారైన తమ అంచనాలతో మానసిక వ్యధ చెందుతూ, ఆర్థిక ఇబ్బందులను తల్చుకుని పరాయి దేశాల్లోనే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
కొల్లాపూర్, జనవరి 17: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల అడవులలో జింకను వేటాడినట్లు సమాచారం రావడంతో అటవీశాఖాధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి జంతువుల వేటగాడైన బోయ శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నారు. అటవీశాఖ క్షేత్రాధికారి మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.
మర్రిపాడు, జనవరి 17: కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుండి రెండు కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొన్న దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఈఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం జాతీయ రహదారిపై గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగింది. గ్రామంలోని ఆదర్శపాఠశాల సమీపంలో గల ముంబై జాతీయ రహదారిపై కట్టెల లోడుతో ట్రాక్టర్ నాయుపల్లి నుండి ఆత్మకూరు వైపుకు వస్తోంది.