S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/21/2018 - 00:30

కర్నూలు, డిసెంబర్ 20: వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన డిపాజిట్ సొమ్ము రూ.27 కోట్లుస్వాహా చేసిన చెన్నైకు చెందిన యంకే.ఆదిల్‌ఖాన్‌ను కర్నూలు సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.

12/20/2018 - 23:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: రాజధాని ఢిల్లీలో సిక్కుల ఊచకోత కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ మాజీ నేత సజ్జన్‌కుమార్ గురువారం ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. సిక్కుల హత్య కేసుకు సంబంధించిన మరోకేసులో మూడు రోజుల క్రితమే ఢిల్లీ హైకోర్టు ఆయనకు యావజ్జీవ శిక్ష విధించింది. గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఆయన కోర్టుకు వచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు మొబైల్‌ఫోన్ పోలీసులకు సరెండర్ చేశారు.

12/20/2018 - 22:53

రామడుగు, డిసెంబర్ 20: పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నకానుకలు సరిపోలేదని, మరింత కట్నం కావాలని నిత్యం భర్తతో పాటు ఆడపడుచు, మామ వేదించడంతో కట్నం ఇచ్చుకునే స్థితిలో కనిపెంచిన వారు లేరని మరణమే శరణ్యమనుకున్నదేమో ఓ అబల ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గుండి గ్రామానికి చెందిన ముంజం ప్రవీణ్‌కు వెల్గటూరు మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన ముంజం జ్యోతితో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిపారు.

12/20/2018 - 22:24

కొయ్యూరు, డిసెంబర్ 20: కొయ్యూరు గ్రామానికి చెందిన గంగిశెట్టి శ్రావ్యశ్రీ(3) మెదడు సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందింది. జ్వరంతో బాధపడుతున్న బాలికను తండ్రి చిరంజీవి మెరుగైన వైద్య సేవలకై తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు గత 15 రోజుల క్రితం తరలించారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలందింప చేసారు. మొదట డెంగ్యూ జ్వర లక్షణాలు ఉన్నాయని వైద్యం అందించినట్లుగా ఆయన తెలిపారు.

12/20/2018 - 22:15

గిద్దలూరు, డిసెంబర్ 20: భార్య మృతిచెందిందని మనస్థాపం చెంది భర్త కూడా మృతిచెందిన సంఘటన గురువారం గిద్దలూరు పట్టణంలో చోటుచేసుకుంది. గిద్దలూరు పట్టణంలో ఫ్రెండ్స్ సెంటర్‌లో బొరుగుల బండి నడుపుకుంటున్న పర్చూరి రామయ్య భార్య నారాయణమ్మ (66) గురువారం ఉదయం అనారోగ్యంతో మృతిచెందింది. భార్య మృతి చెందడంతో మనస్థాపంతో రామయ్య (76) గురువారం సాయంత్రం మృతి చెందాడు. ఒకేసారి భార్య భర్త ఇరువురూ మృతిచెందారు.

12/20/2018 - 22:09

అమరాపురం, డిసెంబర్ 20 : మండల పరిధిలోని గొల్లమారనపల్లికి చెందిన రంగమ్మ (52) బుధవారం కడుపునొప్పి తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు చాలాఏళ్లుగా రంగమ్మకు కడుపునొప్పి వస్తుండేదన్నారు. బుధవారం ఉన్నఫళంగా కడుపునొప్పి రావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

12/20/2018 - 22:00

పీలేరు, డిసెంబర్ 20: పీలేరు అటవీశాఖ పరిధిలోని బుధవారం రాత్రి ఎల్లమంద-పీలేరు రోడ్డు మార్గంలో అటవీశాఖ సిబ్బంది వాహనాలను తనిఖీచేస్తుండగా ఎల్లమంద మార్గం నుంచి అతివేగంగా వాహనం వెళ్లడంతో అటవీశాఖ సిబ్బంది వెంబడించగా అక్రమంగా కారులో తరలిస్తున్న ఎర్రచందనంతో సహా స్వాధీనం చేసుకున్నట్లు డీఎఫ్‌ఓ జగన్నాధ్ సింగ్ తెలిపారు.

12/20/2018 - 21:56

మెదక్ రూరల్, డిసెంబర్ 20: మహిళను దారుణంగా హత్యచేసిన సంఘటన మండలంలోని జానకంపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మెదక్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన మార్గం గంగయ్యకు కౌడిపల్లికి చెందిన లక్ష్మీ, భూమయ్యల కూతురు లక్ష్మీ(35)ను 18 సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. గత సంవత్సరం గంగయ్య అనారోగ్యంతో మృతి చెందాడు.

12/20/2018 - 20:45

కాగజ్‌నగర్, డిసెంబర్ 20: తెలంగాణ నుండి మహారాష్టక్రు వివిధ రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని బుధవారం రాత్రి స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రైల్వే పోలీసులు పట్టుకున్నారు.

12/20/2018 - 04:29

ముంబయి, డిసెంబర్ 19: మరాఠాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ తాము మహారాష్ట్ర చట్టసభలో ఆమోదించిన బిల్లు ప్రకారం రిజర్వేషన్ల కోటాను వచ్చే ఏడాది జనవరి 23వరకు ఉద్యోగ నియామకాల్లో అమలు చేయమని మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు తెలియజేసింది.

Pages