S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/20/2018 - 04:26

పెనమలూరు, డిసెంబర్ 19: కృష్ణా జిల్లా పెనమలూరు సీనియర్ సర్వేయర్ కొల్లి హరిబాబు ఆస్తులపై ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదుతో విస్తృత తనిఖీలు జరిపారు. రామచంద్రాపురంలోని కరెన్సీనగర్‌లో నివాసం ఉంటున్న ఇల్లు, పెనమలూరులో పనిచేసే కార్యాలయం సహా మరో ఐదుచోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

12/20/2018 - 04:08

ఇంఫాల్, డిసెంబర్ 19: కేంద్ర ప్రభుత్వాన్ని, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సామాజిక మాధ్యమంలో విమర్శించిన ఒక పాత్రికేయునికి ఒక సంవత్సరం కారాగార శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. ఇంఫాల్‌లోని వెస్టు డిస్ట్రిక్టు కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రీట్ ఈ నెల 14న ఈ శిక్ష విధించినట్టు పీటీఐ బుధవారం వెల్లడించింది.

12/20/2018 - 03:59

ఆగ్రా, డిసెంబర్ 19: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పోయాఘాట్ వద్ద దారుణం చోటుచేసుకుంది. బీటెక్ ఫస్టియర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. విద్యార్థిని కోచింగ్ సెంటర్‌కు వెళ్తుంగా భగవాన్ టాకీస్ వద్ద ఇద్దరు వ్యక్తులు అటకాయించారు. ఇది జాతీయ రహదారిని ఆనుకునే ఉంది. ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. పోయాఘాట్ వద్ద అప్పటికే నలుగురు కామాంధులు అక్కడ వేచి ఉన్నారు.

12/20/2018 - 01:39

పమిడిముక్కల, డిసెంబర్ 19: గత రెండు నెలలుగా పశువుల అపహరణకు గురవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేస్తున్నా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న గేదెల దొంగను పట్టుకోవాలంటే పోలీసులకు సవాల్‌గా మారింది. పలు ప్రాంతాలలో గేదెలను దొంగిలిస్తున్న ముఠా కోసం పమిడిముక్కల పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

12/20/2018 - 01:30

సైదాబాద్, డిసెంబర్ 19: కార్యాలయంలో అధికారి వేధింపులు భరించలేక ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సైదాబాద్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే... సైదాబాద్ కాలనీలో నివసించే నర్సింగ్ (30) లోయర్ ట్యాంక్ బండ్‌లోని ప్రైవేట్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం విధులు ముగించుకోని వచ్చిన నర్సింగ్ ఇంట్లో ఎవరులేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

12/20/2018 - 05:16

గార్లదినె్న: అనంతపురం జిల్లాలో బుధవారం ఘోరం జరిగింది. కులం కాని వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని కక్షగట్టిన సోదరుడు చెల్లి, ఆమె ఇద్దరు పిల్లలను కొడవలితో నరికి చంపాడు. అనంతపురం జిల్లా గార్లదినె్నలో నివాసముంటున్న బోయ నల్లప్ప భార్య మీనాక్షి (24), ఆమె పిల్లలు వితేష్(3), కీర్తి(1)ని సోదరుడి వరుసయ్యే హరి దారుణంగా నరికి చంపారు. పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

12/19/2018 - 22:53

అంబాజీపేట, డిసెంబర్ 19: గత రెండు రోజులుగా వీస్తున్న చలిగాలులకు తట్టుకోలేక అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలానికి చెందిన తెలగారెడ్డి జగన్నాదం(72) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం బుధవారం రాత్రి వీచిన చలిగాలులు తట్టుకోలేక జగన్నాదం మృతి చెందాడని వారు తెలిపారు. ఈ మేరకు మృతుడు భార్య పద్దాలు తహసీల్ధార్, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

12/19/2018 - 22:53

రాజమహేంద్రవరం, డిసెంబర్ 19: రాజమహేంద్రవరంలోని ఎవి అప్పారావురోడ్డులో నివసించే వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈసంఘటన 3రోజుల క్రితమే జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం ఎవి అప్పారావురోడ్డులోని ఎస్‌ఎస్‌కె ప్లాజా అపార్ట్‌మెంట్‌లో నివసించే వడ్డి మల్లిఖార్జునప్రసాద్ కోరుకొండలోని ఆస్తిని అమ్మగా వచ్చిన రూ. 56లక్షలు, బ్యాంకులో డ్రా చేసిన సొమ్ము కలిపి మొత్తం రూ.

12/19/2018 - 22:47

యలమంచిలి, డిసెంబర్ 19: పెథాయ్ తుపాను కారణంగా యలమంచిలి మండలం కొంతేరు గ్రామంలో కురిసిన వర్షాలకు తాటియాకు ఇల్లు కూలి దిరిశాల అనసూయ (82) అనే వృద్ధురాలు మృతి చెందింది. అనసూయ కుమారుడు వెంకటేశ్వరరావు అదే గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. బుధవారం ఉదయం ఇంటికి వచ్చి చూసిన వెంకటేశ్వరరావు తల్లి మృతి చెందినట్టు గుర్తించాడు. సమాచారం అందుకున్న యలమంచిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

12/19/2018 - 22:41

ఇందుకూరుపేట, డిసెంబర్ 19: కొందరు వ్యాపారులు రైసుమిల్లులను గ్రామాల్లో ఏర్పాటు చేసుకుని లక్షల విలువ చేసే పేదల బియ్యాన్ని పాలిష్ చేసి బహిరంగ మార్కెట్లో దర్జాగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండల పరిధిలోని కొరుటూరు గ్రామంలో ఉన్న శ్రీ ఆంజనేయ రైసుమిల్లుపై బుధవారం విజిలెన్స్ ఎస్పీ శ్రీకంఠనాధ్‌రెడ్డి, డిఎస్‌ఓ చిట్టిబాబు ఆకస్మిక దాడి చేశారు.

Pages