-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
గూడూరు, డిసెంబర్ 19: నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన లారీడ్రైవర్ ఎస్కె రియాజ్ బాబుకు రెండేళ్లు జైలుశిక్ష, రూ. 11వేలు జరిమానాను విధిస్తూ అడిషనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్క్లాస్ కోర్టు జడ్జి ఎన్ లావణ్య బుధవారం తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాయుడుపేటకు చెందిన రామాబత్తిన వెంకటేశ్వర్లు ఓజిలి మండలంలో వీఆర్వోగా పనిచేసేవారు.
చిత్తూరు , డిసెంబర్ 19: జిల్లాలో సంచనలం సృష్టించిన బంగారు నగల చోరీ కేసును జిల్లా పోలీసులు చేధించారు. చోరీకి పాల్పడిన మహారాష్టల్రోని చందు గుండిభా సుఖేల్ ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్టుచేసి వారినుంచి 4.372కిలోల బంగారు నగలు, స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పాలకొండ (టౌన్), డిసెంబర్ 19: పాలకొండ నుంచి వీరఘట్టం వెళ్లే రహదారిపై గజాలఖానా వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం చిలకాం గ్రామానికి చెందిన అంపావిల్లి ఉమ పట్నాయక్ (32) మృతి చెందారు. వీరఘట్టం వైపు నుంచి వస్తున్న చెరకు లారీ పాలకొండ నుంచి వీరఘట్టం ద్విచక్ర వాహనంపై వెళుతున్న పట్నాయక్ను బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు.
తెర్లాం, డిసెంబర్ 19: ప్రమాదవశాత్తు వృద్దురాలు బావిలో పడి మృతిచెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్ఐ శ్రీనివాసరావు అందించిన వివరాల ప్రకారం మండలంలోని పెరుమాళి గ్రామానికి చెందిన బెవర పోలిపల్లిమ్మ(72) ప్రమాదవశాత్తు కాలిజారి బావిలో పడి మృతిచెందిందన్నారు. ఈమెకు నలుగురు పిల్లలున్నారు.
గజపతినగరం, డిసెంబర్ 19: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన పిట్టాడ గ్రామ సమీపంలో చోటుచేసుకొన్నది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం ఎంవిపి కాలనీలో ఉంటున్న ఇసరపు అప్పారావు(23) తన సోదరుడు బారసాల నిమిత్తం ఇటీవల లోతుగెడ్డ వచ్చాడు. పాచిపెంట మండలం గ్రామంలో బారసాలు జరిగిన అనంతరం తిరిగి అప్పారావు లోతుగెడ్డ వచ్చారు. అయితే మంగళవారం పిట్టాడ వెళి వస్తానని చెప్పి వెళ్లాడు.
ఆదిలాబాద్, డిసెంబర్ 18: ఆదిలాబాద్ జిల్లా సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపుల కుంభకోణం గుట్టురట్టయింది. గత నాలుగేళ్ళుగా స్టాంప్స్ రిజిస్ట్రేషన్ విభాగంలో బాండ్ పేపర్లు, స్టాంపుల విక్రయాలకు సంబంధించి రూ.78 లక్షలు దిగమింగిన ఇద్దరు ఇంటి దొంగలపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడుకి కోర్టు నుంచి ఊరట లభించింది. ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో వారిద్దరికీ అరెస్టు నుంచి గతంలో ఇచ్చిన మినహాయింపును వచ్చే ఏడాది జనవరి 11 వరకు పొడిగిస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టు మంగళవారం తెలిపింది.
ధర్మవరం, డిసెంబర్ 18: కొండవీడు ఎక్స్ప్రెస్ రైలులో ఓ దొంగ నగల కోసం ఘోరానికి పాల్పడ్డాడు. బంగారు గొలుసు కోసం ఓ గర్భిణిని రైలు నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలతో బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అనంతపురం జిల్లా ధర్మవరం రైల్వేస్టేషన్ సమీపంలోని గొల్లపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది.
హైదరాబాద్, డిసెంబర్ 18: అనంతపురం జిల్లాలో ప్యాక్షనిజానికి కేంద్ర బిందువుగా పేరుగాంచిన మద్దెల చెరువుసూరి అలియాస్ గంగుల సూర్యనారాయణ రెడ్డి హత్య కేసులో మల్లిశెట్టి భానుకిరణ్కు హైదరాబాద్ నాంపల్లి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. మంగళవారం నాంపల్లి మెట్రోపాలిటన్ అదనపున్యాయమూర్తి కే సునీత తీర్పును ప్రకటించారు. భానుకిరణ్కు యావజ్జీవ శిక్షతో పాటు 20 వేల రూపాయల జరిమానాను విధించారు.
పార్వతీపురం (రూరల్), డిసెంబరు 18: బొకారో-అలెప్పీ రైలులో భారీ దొంగతనం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా, చెల్లూరు కు చెందిన రైల్వే కాంట్రాక్టర్ సత్యనారాయణకు చెందిన రెండు సూట్ కేసులు మాయమైనట్లు ఆయన మంగళవారం పార్వతీపురం రైల్వే స్టేషన్లో ఫిర్యాదు చేసారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.