-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: రాఫెల్ జెట్ కొనుగోళ్లపై ఇచ్చిన తీర్పులో కాగ్, నివేదిక, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి ప్రస్తావించిన అంశాల్లో దొర్లిన తప్పులను సరిదిద్ది తీర్పును సవరించాలని కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తీర్పులో పొరపాటున దొర్లిన దోషాల వల్ల వివాదాలు తలెత్తుతున్నాయని కేంద్రం పేర్కొంది.
విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 15: మనస్థాపంతో పాండురంగస్వామి ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖ బీచ్ రోడ్డులో శనివారం కలకలం సృష్టించింది. పెందుర్తిలోని కృష్ణరాయపురంలో నివాసముంటున్న కొప్పిశెట్టి నాగేశ్వరరావు బీచ్రోడ్డులోని పాండురంగస్వామి గుడి, పినగాడిలోని శివాలయానికి కార్యనిర్వాహణాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.
విజయవాడ (క్రైం), డిసెంబర్ 15: నిషేధిత విదేశీ సిగరెట్ల వ్యాపారిని టాస్క్ఫోర్స్, ఐటీసీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి రవాణా చేస్తూ విజయవాడలోని ఓ గోడౌన్లో పెద్దఎతున్త ఉంచిన నిల్వలను దాడి చేసి పట్టుకున్నారు. విక్రేతను అరెస్టు చేసి సుమారు 15లక్షల రూపాయల విలువైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ముందు హాజరుపరిచారు.
విజయవాడ (క్రైం), డిసెంబర్ 15: మోటారు వాహనాల చోరీ కేసులో నలుగురిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.1.35లక్షలు విలువైన చోరీ సొత్తు రికవరీ చేసినట్లు డీసీపీ డాక్టర్ గజరావు భూపాల్ తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు నగర వ్యాప్తంగా చేపడుతున్న డ్రంకన్ డ్రైవ్ కార్యక్రమం సత్ఫాలితాలనిస్తోంది. ఇందులో భాగంగా నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాల్లో 1 నుంచి 15 వరకు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో మొత్తం 961 మంది పట్టుబడ్డారు.
తలకొండపల్లి,డిసెంబర్ 15: తలకొండపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని చంద్రధన గ్రామంలో శనివారం మధ్యాహ్నం తోడేటి భాస్కర్రెడ్డి 30 అనే రైతు తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సురేష్యాదవ్ తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం తుక్కుగుడ గ్రామానికి చెందిన మమతకు నాలుగు సంవత్సరాల క్రితం భాస్కర్రెడ్డితో వివాహం జరిగిందన్నారు.
ఉప్పల్, డిసెంబర్ 15: బోడుప్పల్ పట్టణంలోని ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ఎట్టకేలకు రెవెన్యూ అధికార యంత్రాంగం కదిలింది. విలువైన స్థలాలను కబ్జా చేసి యదేచ్ఛగా ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారని పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలపై అధికారులు స్పందించారు. పోలీసు బందోబస్తు మధ్య శనివారం అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు ఆర్ఐ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
హయత్నగర్, డిసెంబర్ 15: నిర్లక్ష్యంతో వేగంగా కారును నడిపి యువకుడి ప్రాణాన్ని బలిగొనడంతో పాటు మరో ముగ్గురు యువకులకు గాయాలు పాలు చేశాడో యువకుడు. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి రోడ్డుకు అవతలి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం..
తాండూరు, డిసెంబర్ 15: తాండూ రు పోలీస్ సబ్ డివిజన్తో పాటు జిల్లాలో సంచలనం రేకేత్తించిన తాండూరు పెన్నా సిమెంట్స్ అధికారులు ఉద్యోగుల నివాస సముదాయంలో ఈ సంవత్సరం జనవరి 28న జరిగిన భారీకి సంబంధించిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా చెడ్డి గ్యాంగ్ను దాదాపు11 నెలల అనంతరం సుదీర్ఘ దర్యాప్తు అనంతరం పోలీసులు పట్టుకుని శనివారం దొంగల ముఠాను అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: అగస్టావెస్ట్లాండ్ వీవీఐపీ హెలీకాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్ కస్టడిని కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది. 57ఏళ్ల బ్రిటన్ జాతీయుడు మిచెల్ను శనివారం సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ ఎదుట హాజరుపరిచారు. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అరెస్టుచేసిన మిచెల్ను ఈనెల 4న భారత్కు తీసుకొచ్చారు.